twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దేశవ్యాప్తంగా రికార్డులు తిరగరాస్తున్న సైరా టీజర్.. చిరంజీవి కెరీర్‌లోనే హయ్యెస్ట్‌గా

    |

    భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన సైరా నర్సింహారెడ్డి రిలీజ్‌కు ముస్తాబయింది. అక్టోబర్ 2న రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం భారీగా ప్రమోషన్ ప్రారంభించారు. నిర్మాత రాంచరణ్. ప్రమోషన్‌లో భాగంగా ముంబైలో సైరా మూవీ హిందీ టీజర్‌ను ముంబైలో లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్, సురేందర్ రెడ్డి, తమన్నా, రవి కిషన్, హిందీలో సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న హీరో ఫర్హాన్ అఖ్తర్ తదితరులు టీజర్ రిలీజ్ వేడుకలో పాల్గొన్నారు. విడుదలైన కొద్ది గంటల్లోనే సైరా టీజర్ వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..

    Recommended Video

    Sye Raa Teaser (Telugu)
    చిరంజీవి కెరీర్‌లోనే

    చిరంజీవి కెరీర్‌లోనే

    మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే ఎన్నడూ లేని విధంగా సైరా టీజర్‌ను అట్టహాసంగా రిలీజ్ చేశారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో టీజర్‌ను అభిమానులకు, సినీ ప్రేక్షకులకు అందించారు. చిరంజీవి బర్త్ డే కానుకగా విడుదల చేసిన ఈ టీజర్ అన్ని భాషల్లోనూ రికార్డు వ్యూస్ సాధిస్తున్నది.

    రిలీజైన కొద్ది గంటల్లోనే

    రిలీజైన కొద్ది గంటల్లోనే

    సైరా టీజర్‌ రిలీజైన కొద్ది గంటల్లోనే రికార్డుల మోత మోగించడం మొదలైంది. అన్ని భాషల్లోనూ కలిపి 10 మిలియన్ల డిజిటల్ వ్యూస్ సాధించింది. టీజర్‌లో భావోద్వేగమైన సన్నివేశాలు, పవర్ ఫుల్ డైలాగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నట్టు సినీ వర్గాలు వెల్లడించాయి. మరికొన్ని గంటల్లో మైలురాయిగా నిలిచే విధంగా వ్యూస్ సాధించడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు.

    జాతీయ ప్రాజెక్ట్‌గా బిగ్‌బీ

    జాతీయ ప్రాజెక్ట్‌గా బిగ్‌బీ

    సైరా చిత్రంలో అన్ని భాషలకు సంబంధించిన స్టార్ హీరోలు, హీరోయిన్లు నటించడంతో జాతీయ స్థాయి చిత్రంగా మారింది. అమితాబ్, నయనతార, తమన్నా, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు లాంటి ఎందరో సినీ ప్రముఖులు సైరా చిత్రంలో భాగస్వామ్యం అయ్యారు. మోహన్ లాల్ మలయాళంలో వాయిస్ ఓవర్ ఇవ్వడం గమనార్హం.

    నటీనటులు, సాంకేతిక వర్గం

    నటీనటులు, సాంకేతిక వర్గం

    ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి పాత్రలో చిరంజీవికి భార్యగా నయనతార నటిస్తుండగా, నృత్యకారిణి లక్ష్మీగా తమన్నా నటించనున్నది. అవుకు రాజు అనే యుద్ధ వీరుడిగా కిచ్చ సుదీప్, రాజ పాండ్యన్‌గా విజయ్ సేతుపతి కనిపించబోతున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, రాంచరణ్ నిర్మాతగా మారారు. రత్నవేలు సినిమాటోగ్రఫి, అమిత్ త్రివేది సంగీతం, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, రాజీవన్ ప్రొడక్షన్ డిజైన్ చేశారు.

    English summary
    Sye Raa Narasimha Reddy teaser launch: Mega star Chiranjeevi's Sye Raa Narasimha Reddy teaser launch happend in Mumbai on Tuesday (August 20). Chiranjeevi, Nayanthara, Ram Charan, Tammannah Bhatia, Surender Reddy are attended this fuction. In this event, Tamannah Bhatia speaks to media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X