Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నా కల నెరవేరింది.. ఆ కోరిక తీరింది.. సైరా టీజర్ వేడుకలో తమన్నా
భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన సైరా నర్సింహారెడ్డి రిలీజ్కు ముస్తాబయింది. అక్టోబర్ 2న రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం భారీగా ప్రమోషన్ ప్రారంభించారు నిర్మాత రాంచరణ్. ప్రమోషన్లో భాగంగా ముంబైలో సైరా మూవీ హిందీ టీజర్ను ముంబైలో లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్, సురేందర్ రెడ్డి, తమన్నా, రవి కిషన్, హిందీలో సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న హీరో ఫర్హాన్ అఖ్తర్ తదితరులు టీజర్ రిలీజ్ వేడుకలో పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశంలో తమన్నా మాట్లాడుతూ..
సైరా నర్సింహారెడ్డి చిత్రంలో నటించే అవకాశం రావడం నాకు నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ ఆఫర్ ఇచ్చినందుకు సురేందర్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పాలి. ఇంతకు ముందు దర్శకుడు సూరి సినిమాలో నటించాను. నాకు ఏదైనా రోల్ ఆఫర్ చేస్తే ఏదో విశిష్టత ఉంటేనే నాకు ఆఫర్ చేస్తాడు. దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ప్రవేశించినప్పుటి నుంచి చిరంజీవితో నటించాలనే కోరిక ఉండేది. ఈ సినిమాలో నటించడంతో చిరంజీవితో కలిసి నటించాలనే నా కల పూర్తి అయింది. సైరాలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు చిరంజీవి గారికి థ్యాంక్స్ చెప్పుకొంటున్నాను.
సైరా సినిమా కోసం రాంచరణ్ నిర్మాతగా మారి హృదయం పెట్టి సినిమాను రూపొందించారు. రాంచరణ్తో కలిసి నటించిన అనుభవం కూడా ఉంది. ఓ జీవితం కంటే ఎక్కువగా ఈ సినిమాను తెరకెక్కించేందుకు చాలా కష్టపడ్డాడు. ఇక చిరంజీవి కూతురు సుస్మిత స్టైలిష్ట్గా పనిచేసింది. ఆమె కృషి కూడా చాలా గొప్పగా ఉంది. నా పాత్ర లక్ష్మీకు కావాల్సిన గెటప్ను పక్కాగా డిజైన్ చేశారు. దాంతో ఆ పాత్రకు వంద శాంత న్యాయం చేయడానికి ఛాన్స్ లభించింది. ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరికి నా థ్యాంక్స్ అని తమన్నా అన్నారు.
సైరా చిత్రంలో స్టార్ హీరోలు, హీరోయిన్లు నటించడం సెన్సేషన్గా మారింది. అమితాబ్, నయనతార, తమన్నా, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు లాంటి ఎందరో సినీ ప్రముఖులు సైరా చిత్రంలో భాగస్వామ్యం అయ్యారు. నయనతార చిరంజీవికి భార్యగా నటిస్తుండగా, నృత్యకారిణిగా తమన్నా నటించనున్నది. అవుకు రాజు అనే యుద్ధ వీరుడిగా కిచ్చ సుదీప్, రాజ పాండ్యన్గా విజయ్ సేతుపతి కనిపించబోతున్నారు.