Don't Miss!
- News గజలక్ష్మీ యోగం.. నేటినుండి ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మేకప్ వేస్తే చిరంజీవిని హ్యాండిల్ చేయడం కష్టం.. ఇంట్రెస్టింగ్గా రాంచరణ్
భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన సైరా నర్సింహారెడ్డి రిలీజ్కు ముస్తాబయింది. అక్టోబర్ 2న రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం భారీగా ప్రమోషన్ ప్రారంభించారు నిర్మాత రాంచరణ్. ప్రమోషన్లో భాగంగా ముంబైలో సైరా మూవీ హిందీ టీజర్ను ముంబైలో లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్, సురేందర్ రెడ్డి, తమన్నా, రవి కిషన్, హిందీలో సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న హీరో ఫర్హాన్ అఖ్తర్ తదితరులు టీజర్ రిలీజ్ వేడుకలో పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశంలో రాంచరణ్ ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు.
గతంలో మీ ఫాదర్ను యాక్టర్గా చూశారు. స్ఫూర్తి పొందారు? కానీ సైరా విషయంలో నిర్మాతగా చిరంజీవిని ఎలా హ్యాండిల్ చేశారు? నిర్మాతగా, కుమారుడిగా మీ నాన్నతో పనిచేయడం ఎలాంటి ఫీలింగ్ను కలిగించింది అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ..
తండ్రితో పనిచేయడం వేరు.. చిరంజీవికి నిర్మాతగా వ్యవహరించడం వేరు. ఈ రెండు అనుభూతులు ఒకటిలా ఉండవు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను. ఆయన మేకప్ వేసుకొన్న తర్వాత కొద్ది నిమిషాల్లోనే పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తారు. మేకప్ పూర్తయిన వెంటనే పూర్తిగా ఆ పాత్రలోనే ఉండిపోతారు. ఆయనను హ్యాండిల్ చేయడం నా వల్ల కాదని తెలుసుకొన్నాను.
అందుకే ఇంటిలో నా సిస్టర్స్ మా నాన్నను హ్యాండిల్ చేశారు. ఈ సినిమా నిర్మాణంలో మా అమ్మ కూడా భాగం కావడం వల్ల సెట్లో మా నాన్ను ఆమె హ్యండిల్ చేసేవారు. దాంతో నాకు పెద్దగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఏర్పడలేదు అని రాంచరణ్ అన్నారు.
సైరా చిత్రంలో స్టార్ హీరోలు, హీరోయిన్లు నటించడం సెన్సేషన్గా మారింది. అమితాబ్, నయనతార, తమన్నా, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు లాంటి ఎందరో సినీ ప్రముఖులు సైరా చిత్రంలో భాగస్వామ్యం అయ్యారు. నయనతార చిరంజీవికి భార్యగా నటిస్తుండగా, నృత్యకారిణి లక్ష్మీగా తమన్నా నటించనున్నది. అవుకు రాజు అనే యుద్ధ వీరుడిగా కిచ్చ సుదీప్, రాజ పాండ్యన్గా విజయ్ సేతుపతి కనిపించబోతున్నారు.