Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
‘సైరా నరసింహారెడ్డి’లో అమితాబ్, విజయ్ పాత్రలు ఇవేనా?
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'సైరా నరసింహా రెడ్డి'. అనుకున్న సమయం కంటే ఈ చిత్రం షూటింగ్ కాస్త లేటుగా మొదలైనా.... దర్శకుడు సురేందర్ రెడ్డి వేగంగా తొలి షెడ్యూల్ పూర్తి చేశారు. మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గర అటవీ ప్రాంతంలో వేసిన సెట్లో పూర్తి చేశారు.
చిరంజీవి డ్రీమ్
చిరంజీవి కెరీర్లో ఎన్నో పాత్రలు చేసినా.... భగత్ సింగ్ లాంటి స్వాతంత్ర సమరయోధుడి పాత్ర చేయలేదనే ఓ వెలితి ఉంది. ఎప్పటి నుండి ఇలాంటి సినిమా చేయాలని చిరంజీవి అనుకున్నా వీలు కాలేదు. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఎంతో నచ్చడంతో.... ‘సైరా నరసింహారెడ్డి' పేరుతో డ్రీమ్ ఫుల్ ఫిల్ చేసుకుంటున్నారు.
స్నేహితుడి పాత్రలో విజయ్
ఈ చిత్రంలో తమిళ నటుడు విజయ్ సేతుపతి ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అతడి పాత్రకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. నరసింహారెడ్డి స్నేహితుడు ఓబయ్య పాత్రలో విజయ్ సినిమా మొత్తం చిరంజీవి పక్కనే ఉంటూ కనిపిస్తారని టాక్.
గురువు పాత్రలో అమితాబ్
ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ షెహన్ షా అమితాబ్ తొలిసారి తెలుగు సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఆయన చిరంజీవి గురువు పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. అమితాబ్ పాత్ర ఇందులో ఎంతో కీలకంగా ఉంటుందని సమాచారం.
జాతీయ స్థాయిలో, అందుకే ఇంత భారీగా
‘సైరా నరసింహారెడ్డి' చిత్రాన్ని జాతీయ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. అందుకు తగిన విధంగానే ఈ చిత్రాన్ని గ్రాండ్ లెవల్లో తీస్తున్నారు. బడ్జెట్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. సినిమాకు ముందుగా అనుకున్న దానికంటే ఎక్కువే ఖర్చవుతుందని, రూ. 100 నుండి 150 కోట్ల వరకు ఖర్చయినా భరించేందుకు నిర్మాత రామ్ చరణ్ ప్రిపేర్ అయ్యారని తెలుస్తోంది.
భారీ తారాగణం
నయనతార కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ నుండి అమితాబ్ బచ్చన్, కోలీవుడ్ నుండి విజయ్ సేతుపతి, సాండల్వుడ్ నుండి కిచ్చా సుదీప్... ఈ చిత్రంలో ముఖ్యపాత్రలకు ఎంపిక చేశారు. వీరితో పాటు తెలుగు నటుడు జగపతి బాబు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు.
రామ్ చరణ్
ఓ వైపు బయటి బ్యానర్లలో సినిమాలు చేస్తూనే... మరో వైపు తన సొంత నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్లో ‘సైరా నరసింహారెడ్డి' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న రామ్ చరణ్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. 2018లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.