twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సైరా టీజర్‌కు ముందు చిరు, చెర్రీతో ప్రభాస్.. ముంబైలో ఏం జరిగిందంటే!

    |

    తెలుగు సినిమా సత్తా బాలీవుడ్‌ను తాకింది. గతంలో బాహుబలి సినిమా చరిత్ర తిరుగరాస్తే.. ఇప్పుడు మరోసారి సినీ చరిత్రను లిఖించడానికి సాహో, సైరా సినిమాలు రెడీగా ఉన్నాయి. హిందీ సినీ పరిశ్రమలో హిస్టరీ క్రియేట్ చేయడానికి, ప్రేక్షకులను కొత్త అనుభూతిని పంచడానికి రెడీ అవుతున్నాయి.

    కొద్ది రోజుల క్రితం సాహో హిందీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ముంబైలో ఘనంగా నిర్వహించారు. ఆ కార్యక్రమంలో నిర్మాతలు వంశీ, ప్రమోద్‌తోపాటు హీరో ప్రభాస్, హీరోయిన్ శ్రద్ధా కపూర్ పాల్గొన్నారు. సాహో ట్రైలర్‌కు అన్ని భాషల్లోనూ విశేష స్పందన వచ్చింది. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.

    Sye Raa teaser release: Chiranjeevi, Prabhas, Ram Charan photo goes viral

    ఇక సాహో ట్రైలర్ రిలీజ్ తర్వాత మరోసారి టాలీవుడ్ టాలెంట్ బాలీవుడ్‌ను సర్‌ప్రైజ్ చేసింది. చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకొని రూపొందించిన సైరా టీజర్ ముంబైలో ఆగస్టు 20న విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్, సురేందర్ రెడ్డి, తమన్నా, రవి కిషన్, హిందీలో సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న హీరో ఫర్హాన్ అఖ్తర్ తదితరులు టీజర్ రిలీజ్ వేడుకలో పాల్గొన్నారు.

    సైరా టీజర్‌కు ముందు అదే హోటల్‌లో బస చేసిన చిరంజీవి, రాంచరణ్‌ను ప్రభాస్ కలుసుకొన్నారు. వారి మధ్య కుశల ప్రశ్నలు జరిగాయి. అనంతరం ముగ్గురు తెలుగు సినీ ప్రముఖులు ఫొటోకు ఫోజిచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చిరంజీవి, ప్రభాస్, రాంచరణ్ ఫోటో విస్తృతంగా ప్రచారం అవుతున్నది.

    English summary
    Sye Raa Narasimha Reddy teaser launch: Mega star Chiranjeevi's Sye Raa Narasimha Reddy teaser launch happend in Mumbai on Tuesday (August 20). Chiranjeevi, Nayanthara, Ram Charan, Tammannah Bhatia, Surender Reddy are attended this fuction. Before hsi function, Prabhas, Ram Charan and Chiranjeevi met and given pose for Photo.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X