Don't Miss!
- News అష్టదిగ్బంధనం - బీఆర్ఎస్ భవిష్యత్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!!
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సైరా టీజర్కు ముందు చిరు, చెర్రీతో ప్రభాస్.. ముంబైలో ఏం జరిగిందంటే!
తెలుగు సినిమా సత్తా బాలీవుడ్ను తాకింది. గతంలో బాహుబలి సినిమా చరిత్ర తిరుగరాస్తే.. ఇప్పుడు మరోసారి సినీ చరిత్రను లిఖించడానికి సాహో, సైరా సినిమాలు రెడీగా ఉన్నాయి. హిందీ సినీ పరిశ్రమలో హిస్టరీ క్రియేట్ చేయడానికి, ప్రేక్షకులను కొత్త అనుభూతిని పంచడానికి రెడీ అవుతున్నాయి.
కొద్ది రోజుల క్రితం సాహో హిందీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ముంబైలో ఘనంగా నిర్వహించారు. ఆ కార్యక్రమంలో నిర్మాతలు వంశీ, ప్రమోద్తోపాటు హీరో ప్రభాస్, హీరోయిన్ శ్రద్ధా కపూర్ పాల్గొన్నారు. సాహో ట్రైలర్కు అన్ని భాషల్లోనూ విశేష స్పందన వచ్చింది. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.
ఇక సాహో ట్రైలర్ రిలీజ్ తర్వాత మరోసారి టాలీవుడ్ టాలెంట్ బాలీవుడ్ను సర్ప్రైజ్ చేసింది. చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకొని రూపొందించిన సైరా టీజర్ ముంబైలో ఆగస్టు 20న విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్, సురేందర్ రెడ్డి, తమన్నా, రవి కిషన్, హిందీలో సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న హీరో ఫర్హాన్ అఖ్తర్ తదితరులు టీజర్ రిలీజ్ వేడుకలో పాల్గొన్నారు.
సైరా టీజర్కు ముందు అదే హోటల్లో బస చేసిన చిరంజీవి, రాంచరణ్ను ప్రభాస్ కలుసుకొన్నారు. వారి మధ్య కుశల ప్రశ్నలు జరిగాయి. అనంతరం ముగ్గురు తెలుగు సినీ ప్రముఖులు ఫొటోకు ఫోజిచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చిరంజీవి, ప్రభాస్, రాంచరణ్ ఫోటో విస్తృతంగా ప్రచారం అవుతున్నది.