Don't Miss!
- Technology Ai వీడియో కంటెంట్ ను గుర్తించడానికి Youtube కొత్త టూల్! ఎలా పనిచేస్తుంది?
- Travel ఐఆర్సీటీసీ VIZAG - ARAKU HOLIDAY PACKAGE మార్చి 22 నుంచే..
- News వైసీపీకి షాక్.. పార్టీకు గుడ్ బై చెప్పిన మరో ఎమ్మెల్యే
- Automobiles వయసు కేవలం నెంబర్ మాత్రమే!.. ఎందుకో వీడియో చూస్తే తెలుస్తుంది
- Sports రోహిత్ స్టార్ట్ చేశాడు.. ‘RIP హార్దిక్’ అంటూ పోస్ట్లు Video
- Finance Gold Loan: గోల్డ్లోన్స్ తీసుకున్నోళ్లకి హెచ్చరిక..! ఇవి తప్పక తెలుసుకోండి..
- Lifestyle సంపూర్ణ సూర్యగ్రహణం 2024: అమెరికాలోని వందలాది పాఠశాలలకు సెలవు, ఎందుకో తెలుసా?ఆరోజు ఏం జరుగుతుందో తెలుసా
Syeraa మెగా సర్ప్రైజ్.. పవన్ కళ్యాణ్ ఒక్కరే కాదు మెగా హీరోలంతా ఒకే వేదికపై..
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్పై మెగా పవర్స్టార్ రామ్చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన సినిమా 'సైరా నరసింహా రెడ్డి'. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్గా నటించింది. అమితాబ్ బచ్చన్, తమన్నా, కుచ్చ సుదీప్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నేడు (ఆదివారం) సైరా ప్రీ రిలీజ్ వేడుక అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న సైరా నరసింహా రెడ్డి ప్రీ రిలీజ్ వేడుకకు పెద్ద ఎత్తున మెగా అభిమాన వర్గం తరలి వస్తున్నారు. ఇప్పటికే ల్బీ స్టేడియం అంతా జన సందోహంతో కిటకిటలాడుతోంది. ఈ వేడుకకు సుమ హోస్ట్ గా చేయనుంది. సుమ మాటలు, పంచ్ డైలాగులతో సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రాగణంలో సందడి వాతావరణం నెలకొననుంది.
MEGA SANDRAM🔥🔥🔥🔥 : #SyeraaPreReleaseEvent pics#SyeRaaNarasimhaReddy #MegastarChiranjeevi pic.twitter.com/WiPJlU1Pg3
— TeluguFilmibeat (@TeluguFilmibeat) September 22, 2019
ఇక ఈ వేడుకకు ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ విచ్చేస్తుండగా.. మిగిలిన మెగా హీరోలంతా ఈ వేదికపై కనిపించనున్నారు. మరికొద్ది సేపట్లోనే మెగా హీరోలు అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఈ వేదిక వద్దకు చేరుకోనున్నారు. దీంతో ఒకే వేదికపై ఈ మెగా హీరోలను చూడాలని ఆతృతగా ఉన్నారు మెగా అభిమానులు.