Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
'ఘాజి'ని ముంచి నేషనల్ అవార్డు.. తాప్సి రియాక్షన్!
దగ్గుబాటి రానా నటించిన ఘాజి చిత్రం ఉత్తమ తెలుగు భాషా చిత్రంగ జాతీయ అవార్డు సొంతం చేసుకుంది. 1971 ఇండియా, పాక్ వార్ సందర్భంగా అనూహ్య రీతితో పాక్ సబ్మెరైన్ పి ఎం ఎస్ ఘాజి మునిగిపోయిన సంగతి తెలిసిందే. పాక్ సబ్మెరైన్ ని తామే ముంచామని అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ప్రకటించారు. ఈ సమాచారం ఆధారంగా దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఘాజి చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో రానా ప్రధాన పాత్రలో నేవి అధికారిగా అదరగొట్టాడు.
ఘాజి చిత్రంలో తాప్సి కీలక పాత్రలో నటించింది. ఈ చిత్రానికి జాతీయ అవార్డు దక్కడంతో ఆమె సంతోషం వ్యక్తం చేసింది. ఈ వార్త వినిగానే తనకు చాలా సంతోషం అనిపించిందని తాప్సి మీడియాతో తెలిపింది. జాతీయ అవార్డుగెలుపొందిన చిత్రంలో తాను పలు పంచుకోవడం ఇది మూడవ సారి అని తాప్సి తెలిపింది. తాను ఈ చిత్రంలో చేసిన స్పెషల్ రోల్ మాత్రమే. అయినా కూడా తనకు చాలా సంతృప్తిగా ఉందని తాప్సి పేర్కొంది.
ఘాజి చిత్రం పూర్తి స్థాయిలో అండర్ వాటర్ మిషన్ గా రూపొందింది. తాప్సి నటించిన అందుకాలం, పింక్, ఘాజి చిత్రాలు జాతీయ అవార్డులు గెలుచుకున్నాయి. ఘాజి చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి విడుదలై మంచి విజయం సాధించింది.