Don't Miss!
- News కడపలో వైఎస్ షర్మిలకు ప్లస్ గా వైఎస్ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ లేఖాస్త్రం!!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Automobiles వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కంగనా ఫ్యామిలీపై మండిపడిన తాప్సి.. చాలా బాధ పడ్డానంటూ కౌంటర్స్
కంగనా రనౌత్, తాప్సి మధ్య చెలరేగిన వివాదం రోజు రోజుకూ మరింత మందురుతోంది. ఇటీవలే కంగనా సోదరి రంగోలి తాప్సిని ఉద్దశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేయగా తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో తాప్సి.. కంగనా ఫ్యామిలీపై మండిపడుతూ కౌంటర్స్ వేసింది. వివరాల్లోకి పోతే..
కంగనా పై తాప్సి.. రంగంలోకి రంగోలి
గతంలో ఓసారి కంగనా రనౌత్ని ఉద్దేశిస్తూ ఆమె అతివాదని కామెంట్స్ చేసింది తాప్సి. ఇక్కడే ఈ ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. తన సోదరిని ఎవరేమన్నా వెంటనే రంగం లోకి దిగే కంగనా సోదరి రంగోలి.. తాప్సీపై తీవ్ర విమర్శలు గుప్పించింది. ఆమె చాలా చీప్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు తాప్సి అందరినీ కాపీ కొడుతుందని ఘాటుగా విమర్శించింది రంగోలి. అలా మొదలైన ఈ వివాదం మరింత ముదురుతోంది.
తాప్సి మాటల తూటాలు
ఇక ఇటీవలే కంగనా నటించిన 'జడ్జ్మెంటల్ హై క్యా' మూవీ ట్రైలర్ చూసిన తాప్సీ చాలా బాగుందని చెప్పింది కానీ కంగనా గురించి మాట్లాడలేదు. దీంతో మరోసారి కంగనా సోదరి రంగోలి తన నోటికి పని చెప్పింది. ''కొందరు కంగనా రనౌత్ని కాపీకొడతారు. కానీ ప్రశంసించేందుకు మాత్రం వారికి మనసు రాదు'' అనేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాప్సికి టైమ్ రావడంతో తన మాటలకు పదును పెట్టింది.
మహిళా సాధికాతర గురించి మాట్లాడే కంగనా
ఎప్పుడూ మహిళా సాధికాతర గురించి మాట్లాడే కంగనా రనౌత్.. తన 'మిషన్ మంగళ్' సినిమాను ఎందుకు మెచ్చుకోలేదని విమర్శించింది. ''ఓ మహిళ మరో మహిళకు మద్దతుగా ఉండాలని చెప్పే కంగనా.. నా ‘మిషన్ మంగళ్' సినిమాను ఎందుకు మెచ్చుకోలేదు. ఈ సినిమాలో ఐదుగురు మహిళలు ఉన్నారు. మరి ఆమె మమ్మల్ని మెచ్చుకుందా?. నేను ఆమె జూనియర్ని, ఆమెకున్న ఫిల్మోగ్రఫీ నాకు లేదు. అయినప్పటికీ ఇతరులు మెచ్చుకోదగ్గ చిత్రాల్లో నటించా'' అంటూ కంగనా, ఆమె సోదరిని ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది తాప్సి.
మిషన్ మంగళ్ మూవీ
జగన్ శక్తి దర్శకత్వంలో తెరకెక్కిన మిషన్ మంగళ్ సినిమాలో అక్షయ్ కుమార్, విద్యా బాలన్, సోనాక్షి సిన్హా, తాప్సీ, నిత్యా మీనన్, శర్మన్ జోషి కీలక పాత్రలు పోషించారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా సక్సెస్ఫుల్గా ప్రదర్శించ బడుతోంది.