Don't Miss!
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- News ఇంటర్ కళాశాలకు వేసవి సెలవులు...ఎప్పటినుంచంటే..?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఫ్యాన్స్ కోసం క్లైమాక్స్ మార్చాం, అసలు మొదట అనుకున్న క్లైమాక్స్ ఇదీ
ముంబై: అభిమానుల ఆనందం కోసం కథకు సంభంం ఉన్నా లేకపోయినా ఫైట్స్, డాన్స్ , కొన్ని పంచ్ డైలాగులు పెట్టడం, క్లైమాక్స్ లు మార్చడం వంటివి మాస్ సినిమాల్లో కామన్. అయితే క్లాస్ సినిమాల్లో కూడా అలాంటివి జరుగుతాయా అంటే సినిమాలను పోషించే అభిమానుల కోసం తప్పవంటున్నారు. అభిమానుల తృప్తే భాక్సాఫీస్ వద్ద డబ్బులు రాల్చే సాధనం మరి. అందుకేనేమో తాజాగా తాప్సీ నటించిన పింక్ చిత్రం క్లైమాక్స్ సైతం ఫ్యాన్స్ కోసం మార్చామని చెప్తున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే... అమితాబ్ బచ్చన్, తాప్సీ నటించిన హీరోయిన్ ఓరియంటెడ్ హిందీ మూవీ పింక్. అత్యాచారానికి గురైన పాత్రలో తాప్సీ నటించింది. న్యాయవాది పాత్రను బిగ్ బి పోషించాడు.. ఈ చిత్రం విడుదలై హిట్ టాక్ తో దూసుకుపోతున్నది.. ఇందులోని తాప్సీ నటనకు సామాన్య ప్రేక్షకుల నుంచే కాకుండా విమర్శకుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపధ్యంలో ఆమె చిత్రం గురించి ఓ ఆశ్చర్యకరమైన విషయం రివీల్ చేసి అందరినీ షాక్ చేసింది. సినిమాలో హైలెట్ గా నిలుస్తున్న క్లైమాక్స్ మొదట స్క్రిప్టులో లేదని, తర్వాత మార్చామని చెప్తోంది.
తమపై మోపబడిన అక్రమ కేసుపై ముగ్గురు యువతులు చేసే న్యాయపోరాటమే 'పింక్' చిత్రం. ఇందులో వచ్చే కోర్టు సన్నివేశాలు, డైలాగులు ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. అయితే సినిమా క్లైమాక్స్కి వచ్చేసరికి వాస్తవానికి చూస్తే ఆ ముగ్గురు యువతులు కేసులో ఓడిపోతారు. చిత్ర యూనిట్ కూడా దాన్నే క్లైమాక్స్గా అనుకుందట. కానీ సాక్ష్యాధారాలతో కాకుండా మానవత్వంతో తీర్పు ఇచ్చే విధంగా క్లైమాక్స్ను మార్చారట. కథ మార్చడానికి గల కారణాన్ని తాప్సీ ఇలా చెప్పింది.
తాప్సీ మాట్లాడుతూ....''కథ ప్రకారం సాక్ష్యాధారాలు ఆ ముగ్గురు యువతులకు వ్యతిరేకంగా ఉంటాయి. కాబట్టి ఆ కేసులో వాళ్లు ఓడిపోవాలి. కానీ ప్రేక్షకులు ఆలోచించే విధంగా ఉండేటట్లుగా క్లైమాక్స్ను మార్చాం. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఈ చిన్న ప్రయత్నం చేశాం. ఈ సినిమా చూసి కొంతమందైనా సరే.. మహిళలు సమస్యల్లో ఉన్నపుడు వాళ్లకు అండగా నిలబడి ఆదుకోవాలనేదే మా ఉద్దేశం'' అంటూ తెప్పుకొచ్చింది.