Don't Miss!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- News అక్కడ.. యుద్ధ వాతావరణం: భారీగా దాడులు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
షాకవుతారన్న సునీల్ (తడాఖా ప్రెస్మీట్)
హైదరాబాద్ : నాగ చైతన్య, సునీల్, తమన్నా, ఆండ్రియా ప్రధాన పాత్రదారులుగా డాలీ(కిషోర్ పార్దసాని) దర్శకత్వంలో రూపొందిన 'తడాఖా' చిత్రం ఈ నెల 10న విడుదలవుతున్న నేపథ్యంలో ఆ చిత్ర యూనిట్ మీడియాతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో నాగచైతన్య, సునీల్, తమన్నా, ఆండ్రియా, నిర్మాత బెల్లంకొండ సురేష్, గణేష్, దర్శకుడు డాలి తదితరులు పాల్గొన్నారు. తమిళంలో మాధవన్, ఆర్య కాంబినేషన్లో రూపొందిన వెట్టై చిత్రానికి రీమేక్ గా 'తడాఖా' చిత్రాన్ని రూపొందించారు.
ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ...'ఇందులో నేను మాధవన్ చేసాను. దర్శకుడిగా డాలీ తడాఖా ఏమిటో ఈ సినిమాలో చూస్తారు. నాగచైతన్య ఇంత వరకు లవర్ బాయ్గానే చేసాడు. కానీ ఇందులో యాక్షన్ సీన్లు అదరగొట్టాడు. ఫైట్లు చూసి ఆడియన్స్ షాక్ అవుతారు. తమన్నా, ఆండ్రియాలు ప్రేక్షకులను మెప్పిస్తారు' అని తెలిపారు.
నాగ చైతన్య మాట్లాడుతూ...యాక్షన్, ఎంటర్టెన్మెంట్ సమపాళ్లలో ఉన్న సినిమా ఇది. కరెక్ట్ టైంకి విడుదలవుతోంది. ఆడియో కమర్షియల్ సక్సెస్ అయింది. సినిమా కూడా అదే రేంజిలో ఉంటుంది. నా కెరీర్లో గొప్ప సినిమా అవుతుంది. సినిమా చూసి అంతా ఎంజాయ్ చేస్తారు. ఎవరూ డిసప్పాయింట్ అవ్వరు అని వ్యాఖ్యానించారు.
తమన్నా మాట్లాడుతూ...సినిమా షూటింగ్ సమయంలో చాలా ఎంజాయ్ చేసాం. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు ఎంజాస్తారని తెలిపింది.
ఆండ్రియా మాట్లాడుతూ, నేను చేస్తున్న తొలి తెలుగు సినిమా ఇది. నాకు మంచి సక్సెస్ ఇస్తుందనే నమ్మకం ఉంది అన్నారు.
నిర్మాత బెల్లంకొండసురేష్ మాట్లాడుతూ, మే 10న సినిమా విడుదల చేస్తున్నాం. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంటర్టెన్ చేస్తుంది అన్నారు. ఈ చిత్రంలో రమాప్రభ, అశుతోస్ రానా, బ్రహ్మానందం, నాగబాబు, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, ముత్తు తదితరులు నటించారు.
కథ : లింగుస్వామి, మాటలు : వేమారెడ్డి, స్క్రీన్ ప్లే, మాటలు : దీపక్ రాజు, ఎడిటింగ్ : గౌతంరాజు, ఆర్ట్ : ఎ.ఎన్. ప్రకాష్, పాటలు : భాస్కరభట్ల, రామజోగయ్యశాస్త్రి, ఫైట్స్ : కనల్ కన్నన్, రామ్ లక్ష్మణ్, రవివర్మ, రాజశేఖర్,సతీష్,
డాన్స్ : రాజు సుందరం, ప్రదీప్ ఆంథోని, శోభి, సంగీతం : తమన్, సినిమాటోగ్రఫీ : ఆర్థర్ ఎ. విల్సన్, నిర్మాతలు : బెల్లంకొండ సురేష్, గణేష్, మాటలు, స్క్రీన్ ప్లు, దర్శకత్వం : కిషోర్ పార్థసాని(డాలి).