Don't Miss!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Sports Rishabh Pant: నోకియా వల్ల కాదు.. అదే మా కొంపముంచింది
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
త్రివిక్రమ్, వెంకటేష్ చిత్రానికి సంగీత దర్శకుడుగా అతనే కన్ఫర్మ్
త్వరలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రారంభం కానున్న చిత్రానికి సంగీత దర్శకుడుగా తమన్ ని ఎంపిక చేసారు. ఈ చిత్రం యూనవర్శిల్ మీడియా బ్యానర్ పై డివివి దానయ్య నిర్మిస్తారు. ఈ చిత్రం వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం హీరోయిన్ జరుగుతోంది. అనూష్క,సమంత పేర్లు వినిపిస్తున్నాయి. ఈ కాంబినేషన్ లో గతంలో నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి చిత్రాలు వచ్చి హిట్టయ్యాయి. అయితే అప్పుడు రైటర్ గా త్రివిక్రమ్ ఆ చిత్రాలకు పనిచేసారు. ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకుడుగా, వెంకటేష్ తో చిత్రం ఓకే చేయించుకున్నారు. రీసెంట్ గా ఈ చిత్రానికి సంభందించిన సబ్జెక్టు ఫైనల్ అయ్యింది. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా ఖలేజా విడుదలై భాక్సాఫీస్ వద్ద నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. మరో ప్రక్క వెంకటేష్..చంద్రముఖి సీక్వెల్ నాగవల్లి తో డిజాస్టర్ టాక్ తెచ్చుకుని ఉన్నారు. ఇక నిర్మాత దానయ్య ఈ చిత్రానికి ముందు అల్లు అర్జున్ తో చేసిన వరుడు చిత్రం పెద్ద ప్లాప్ అయింది.