Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అపుడు తెలంగాణ, ఇప్పుడు పవన్ పార్టీ: భయంతో తమన్నా!
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన 'జన సేన' పార్టీ ఎన్నికల వేళ రాజకీయాలను మరింత రసవత్తరంగా మార్చిన సంగతి తెలిసిందే. ఈ మధ్య సినిమా రంగానికి చెందిన వారు ఎక్కడ ప్రెస్ మీట్లోపాల్గొన్నా వారికి తప్పకుండా పవన్ కళ్యాణ్ పార్టీ గురించిన ప్రశ్న ఎదురవుతోంది. దీంతో ఎవరికి తోచిన తీరుగా వారు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.
ఇటీవల ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న హీరోయిన్ తమన్నాకు కూడా పవన్ కళ్యాణ్ 'జన సేన' పార్టీ గురించి ప్రశ్న ఎదురైంది. దీనికి తమన్నా స్పందిస్తూ....'నాకు అసలు రాజకీయాల గురించి అవగాహన లేనే లేదు. ఆయన పార్టీ గురించి మాట్లాడాలంటే నాకు ముందు రాజకీయాల గురించి తెలుసుండాలి. అందుకే నేను మాట్లాడను' అంటూ వ్యాఖ్యానించారు.
తమన్నా వ్యాఖ్యలు బట్టి.....పవన్ కళ్యాణ్ పార్టీ గురించి ఏం మాట్లాడితే...ఏంజరుగుతుందో? అనే భయంతో ఆమె ఉన్నట్లు స్పష్టమవుతోంది. గతంలో కూడా తెలంగాణ అంశంలో ఆమెను కొందరు మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆమె స్పందించడానికి నిరాకరించారు. తన కెరీర్కు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశ్యంతోనే తమన్నా ఇలాంటి వివాదాస్పద అంశాలపై స్పందించేందుకు భయపడుతోందని స్పష్టమవుతోంది.
జనసేన పార్టీ గురించిన విషయాల్లోకి వెళితే....పవన్ కళ్యాణ్ ఎవరూ ఊహించని స్పెప్ తీసుకున్నారు. బిజేపీ ప్రధాని అభ్యర్థి మోడీకి తన మద్దతు ప్రకటించారు. దేశానికి కాబోయే ప్రధాని మోడీయేనని ఆయన అన్నారు. విధివిధానాలు లేకుండా రాష్ట్రాన్ని చీల్చారని, మోడీ లాంటి వ్యక్తి నిర్ణయం తీసుకునే స్థానంలో ఉండి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదని ఆయన అన్నారు.