Don't Miss!
- Sports ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- News సాగర్ టెయిల్ పాండ్ నుండి ఏపీ నీటిచౌర్యం; ఎన్నికలవేళ మళ్ళీ కృష్ణా జలవివాదం!!
- Finance Gold Price Today: బంగారం ధర పై పైకే.. ఇక కొనలేమా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
సుకుమార్...తమన్నా
తెలుగు, తమిళ భాషల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న తమన్నా తాజాగా తెలుగులో ఓ చిత్రం చేసేందుకు అంగీకరించిందని సమాచా రం. ప్రస్తుతం 'ఆర్య-2" చిత్ర రూపకల్పన లో నిమగ్నమై ఉన్న సుకుమార్ దర్శకత్వంలో రూపొందే తదుపరి చిత్రంలో హీరోయిన్ గా తమన్మాను ఎంపిక చేసి నట్లు తెలిసింది. తమన్నా నటించిన 'వ్యాపారి" చిత్రం త్వరలో విడుదల కానుంది. ఖుషి, పులి చిత్రాల దర్శకుడు ఎస్.జె.సూర్య ద్విపాత్రాభినయంలో తమన్నా, నమిత, మాళవికలు కథానాయికలుగా నటిస్తున్న చిత్రం 'వ్యాపారి".
క్లోనింగ్ నేపధ్యంలో తమిళంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో ప్రణతి క్రియేషన్స్ పతాకంపై కూనిరెడ్డి శ్రీనివాస్ అందిస్తున్నారు. సంపదలో బిల్గేట్స్ ని మించి పోవాలనుకునే 'వ్యాపారి"గా ఎస్.జె. సూర్య అద్భుతంగా అభినయించారని, మానవ సంబంధాలకు-ఆర్ధిక సంబంధాలకు గల వ్యత్యాసాన్ని దర్శకుడు శక్తి చిదంబరం ఈ చిత్రంలో చక్కగా ఆవిష్కరించారని, ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ప్రకాష్ రాజ్, నాజర్, సీత వారి వారి పాత్రలకు జీవం పోసారని ఆయన అన్నారు. నగర జీవితాలతోపాటు, గ్రామీణ జీవితాలు సైతం పూర్తి యాంత్రికమయమైపోతున్న ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ చూడాల్సిన కుటుంబ థాచిత్రమిదని ఆయన అన్నారు.
ఈ చిత్రానికి మాటలు, పాటలు: భారతీబాబు, సంగీతం: దేవా, నిర్మాత: కూనిరెడ్డి శ్రీనివాస్, దర్శకత్వం: శక్తి చిదంబరం. ఇక అల్లు అర్జున్ కెరీర్ ప్రారంభంలో ఆయనకు మంచి బ్రేక్ ఇచ్చిన 'ఆర్య' చిత్రానికి సీక్వెల్ గా ఈ తాజా చిత్రం రూపొందుతోంది. ఆ చిత్రం దర్శకుడైన సుకుమార్ ఈ సీక్వెల్ కు సైతం దర్శకత్వం వహిస్తున్నాడు. జగడం నిర్మించిన ఆదిత్య ఆర్ట్స్ బ్యానర్ పై వి.ఆదిత్యబాబు, భోగవల్లి ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైద్రాబాద్ లో ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఇంతవరకూ 'ఆర్య-2'గా ప్రచారమైన ఈ చిత్రానికి ప్రస్తుతం టైటిల్ ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. అలాగే ఈ చిత్రంలో ఆల్లు అర్జున్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా నటిస్తుండగా, ఆయనకు జోడిగా కాజల్ నటిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.