శ్రీను వైట్ల సిన్మాలో తమన్నా, నవదీప్
శ్రీను వైట్ల తాజా చిత్రం "రెడీ". ఈ సినిమాలో రామ్, జెనీలియా హీరో హీరోయిన్లు. అయితే సినిమాకు అదనపు హంగులు సమకూర్చడానికి శ్రీను వైట్ల నవదీప్, తమన్నాలను అతిధి నటులుగా ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది.
ప్రముఖ నిర్మాత స్రవంతి రవి కిషోర్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పార్టు దాదాపు పూర్తయింది. ఏప్రిల్ నెలాఖరులో సినిమా విడుదల కానుంది. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.


Click it and Unblock the Notifications











