Don't Miss!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- News న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కావాలనే నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు.. తమన్నా ఆవేదన
దశాబ్దకాలంగా జోరుగా సినిమాలు చూస్తూ వస్తోంది మిల్కీ బ్యూటీ తమన్నా. దాదాపు రెండు తరాల అగ్ర హీరోలందరితో ఆడిపాడిన ఈ ముద్దుగుమ్మ బాహుబలి సినిమాలో డిఫెరెంట్ రోల్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం అలాంటి ఛాయలే ఉన్న మరో పాత్రను 'సైరా నరసింహా రెడ్డి' సినిమాలో తమన్నా చేస్తోందని తెలిసింది. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో తమన్నా చేసేది నెగెటివ్ రోల్ అని, సైరాలో ప్రతినాయికగా తమన్నా కనిపించనుందని వార్తలు వస్తున్నాయి.
రోజురోజుకూ ఈ రకమైన వార్తలు జోరందుకోవడంతో బెంబేలెత్తిపోయిన తమన్నా.. సదరు వార్తలపై సీరియస్ అయింది. సైరా నరసింహా రెడ్డి సినిమాలో తనది ప్రతినాయిక క్యారక్టర్ కాదని, చాలా ప్రాముఖ్యత కల్గిన పాత్రలో నటిస్తున్నానని తమన్నా అంటోంది. ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్లో భాగమైనందుకు సంతోషంగా ఉందని, తన పాత్రపై మీడియా కావాలనే నెగటివ్ ప్రచారం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తోంది తమన్నా. అసలు నిజానిజాలేంటో ఏ కొద్దిమాత్రం కూడా ఆలోచించకుండా ఇలా వార్తలు పుట్టించడం మంచి పద్ధతి కాదని ఆమె అంటోంది.
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తొలితరం స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితకథ ఆధారంగా 'సైరా నరసింహా రెడ్డి' సినిమా తెరకెక్కుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్పై మెగా పవర్స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. చిత్రంలో నయనతార, తమన్నా, అనుష్క చిరు సరసన నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, కుచ్చ సుదీప్, విజయ్ సేతుపతి లాంటి భారీ తారాగణం పాలుపంచుకుంటోంది. అక్టోబర్ 2 వ తేదీన భారీ ఎత్తున ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
ఇక తమన్నా విషయానికొస్తే.. ఈ ఏడాది సంక్రాంతి హిట్ ఎఫ్-2 తో జోష్ పెంచిన ఈమె వరుస సినిమాలకు కమిట్ అవుతోంది. ప్రస్తుతం సైరాతో పాటు ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాజు గారి గది 3 'లో కూడా నటిస్తోంది తమన్నా.