Don't Miss!
- Lifestyle May Day 2024 Wishes : శ్రామికులు లేనిదే అభివృద్ధి లేదు.. శ్రామికుల దినోత్సవ శుభాకాంక్షలు
- Finance Gold Rate: పిచ్చెక్కిస్తున్న పసిడి ధరలు.. నేడు మళ్లీ పెరుగుదల.. రూ.4,900 అప్..
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- News కేసీఆర్ తో టచ్ లో ఉన్న కాంగ్రెస్ ముఖ్యులెవరు..!!
- Automobiles ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత.. విషాదంలో సినీ ఇండస్ట్రీ
ప్రముఖ తమిళ డైరెక్టర్, నటుడు రాజశేఖర్ (62) మృతి చెందారు. ఆదివారం రోజు ఆయన కన్నుమూసినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో తమిళ సినీ పరిశ్రమలో విషాద ఛాయలు నెలకొన్నాయి. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతి తీవ్రంగా కలచి వేసిందని పేర్కొంటున్నారు.
అనారోగ్యం కారణంగా
గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రాజశేఖర్.. ఇటీవలే చెన్నైలోని రామచంద్ర హాస్పిటల్ లో చేరారు. ఈ నేపథ్యంలో ఆయన చికిత్స పొందుతూ సెప్టెంబర్ 8వ తేదీన తుదిశ్వాస విడిచినట్లుగా ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
దర్శకుడిగా, నటుడిగా సినీ ప్రస్థానం
దర్శకుడిగా తమిళ సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఆయన ''పలైవనచొలై, చిన్నపూవే మెళ్ల పెసు'' వంటి సూపర్ హిట్ సినిమాలను డెరెక్ట్ చేశారు. రాజశేఖర్ చెన్నై ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ విద్యార్థి కూడా. అదేవిధంగా నటుడిగా భారతీరాజా దర్శకత్వం వహించిన నిజాల్గల్ (1980) సినిమాతో రాజశేఖర్ తెరంగేట్రం చేయడం జరిగింది.
తెలుగులో కూడా.. పలు టీవీ సీరియల్స్
నటుడిగా రాజశేఖర్ తెలుగు తెరపై కూడా కనిపించారు. తెలుగులో వచ్చిన 'బామ్మ మాట బంగారు బాట' సినిమాలో ఆయన నటించారు. దర్శకుడిగా, నటుడిగా వెండితెర ప్రయాణం కొనసాగించిన ఆయన పలు తమిళ టీవీ సీరియల్స్ లోనూ నటించి గుర్తింపు పొందారు. 'శరవణన్ మీనాక్షి' అనే సీరియల్లో హీరో తండ్రి పాత్రలో ఆయన మెప్పు పొందారు.
సోషల్ మీడియాలో సంతాపాలు
రాజశేఖర్ మృతి వార్త తెలుసుకున్న ప్రేక్షకులు ఆయన కుటుంబ సభ్యులకు సంతాపాలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరోవైపు తెలుగు, తమిళ సినీ పరిశ్రమ లోని పలువురు నటులు, దర్శకులు ఆయన మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.