twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తమిళం జిందాబాద్ !

    By Staff
    |

    Dhanush
    రజనికాంత్ అల్లుడు,తమిళనాట పేరున్న హీరో అయిన ధనుష్ ఇప్పుడు తెలుగులో స్ట్రయిట్ సినిమాతో కనిపించనున్నారని ఫిల్మ్ నగర్ లో గుప్పుమంటోంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తమిళ,తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారని తెలుస్తోంది. అలాగే ధనుష్ బ్రదర్ సెల్వరాఘవన్ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించనున్నారని కథనం. రాఘవన్ గతంలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై 'ఆడువారి మాటలకు అర్దాలే వేరులే' చిత్రాన్ని వెంకటేష్ తో రూపొందించాడు.

    అది ఘన విజయం సాధించంటంతో సురేష్ బాబు మరళా అతన్ని డైరక్ట్ చేయమని అడిగారని తెలుస్తోంది. అయితే తన తమ్ముడు ధనుష్ తో కమిట్ మెంట్ ఉందని చెప్పటంతో ఆ చిత్రాన్నే తమ బ్యానర్ లో చెయ్యమన్నట్లు చెప్పుకుంటున్నారు. తాజాగా మరో తమిళ దర్శకుడు ఉదయ్ శంకర్ తో 'బలాదూర్' అనే ఫ్లాప్ ఇచ్చిన సురేష్ బాబుకి ఈ తమిళ డైరక్టర్ అన్నా హిట్టవ్వాలని కోరుకుందాం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X