Don't Miss!
- Automobiles ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- News ఎన్నికల ఏజెంట్లుగా వాలంటీర్లు - సీన్ రివర్స్...!!
- Sports రుతురాజ్ చెత్త రికార్డు.. చరిత్రలో ఒకే ఒక్కడు!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
సూసైడ్ నోట్ రాసిపెట్టి వెళ్ళిపోయిన మరో నిర్మాత
కొన్ని నెలలకు ముందే ఒక మళయాల నిర్మాత తన సినిమా రషెస్ చూసుకొని అత్మహత్య కు పాల్పడ్డ సంగతి మర్చిపోక ముందే ఇప్పుడు ఇంకొక నిర్మాత కూడా నష్టాలతో అదే బాట పట్టాడు. అనే కోలీ వుడ్ నిర్మాత "మదన్" ఇంట్లో ఒక సూసైడ్ నోట్ రాసిపెట్టి మరీ ఇంటినుంచి వెళ్ళీపోయాడు..
ఆరవన్ (తెలుగులో ఏకవీర).. లింగా.. పాండియనాడు (పల్నాడు).. పాయుంపులి (జయసింహా) లాంటి భారీ బడ్జెట్ సినిమాల్ని డిస్ట్రిబ్యూట్ చేయడంతో పాటు కొన్ని సినిమాలు నిర్మించిన "వేందార్ మూవీస్" అధినేత అయిన మదన్ ఇలా సుసైడ్ నోట్ పెట్టి కాశీకి వెళ్లిపోయాడు.తాను వెళ్ళిపఓవటానికి కారకులు,కారణాలను పక్కాగా వెళ్ళడించకున్నా ఆర్థిక కారణాలే అని తెలుస్తోంది..
మదన్ ఆధ్వర్యంలోని వేందార్ మూవీస్.. ఎస్ఆర్ఎం గ్రూప్ లో భాగం. ఆ గ్రూప్ అధినేత అయిన పారి వేందార్ ఆరు నెలలుగా మదన్ తో మాట్లాడట్లేదట. ఆయన కుటుంబ సభ్యులు తనను ఓ ద్రోహిలాగా చూస్తున్నారని. పారి వేందార్ ఆస్తులన్నింటినీ తనకు రాసిచ్చేయబోతున్నాడని అనుమానిస్తున్నారని. అందుకే తాను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నానని మదన్ సుసైడ్ నోట్ లో రాశాడు.
ఎస్ఆర్ఎం గ్రూప్ లోని ఎస్ఆర్ఎం యూనివర్శిటీలో చేర్పించడం కోసం తాను విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూలు చేసిన కోట్ల రూపాయల డబ్బు.., వాటి వివరాలన్నీ ఎస్ఆర్ఎం మేనేజ్మెంట్ కు అప్పగించానని. మళ్లీ తాను మరో జన్మ కోరుకోవట్లేదు కాబట్టే కాశీలో చనిపోవాలని నిర్ణయించుకుని అక్కడికి వెళ్లిపోతున్నానని అతను వెల్లడించాడు.
తాను తన జీవితం మొత్తం పారి వేందార్ కోసమే బతికానని. ఇప్పుడు కూడా తనకు ఇష్టమైన వ్యక్తి అయిన ఆయన కోసమే తన ప్రాణాలు అర్పిస్తున్నానని తెలిపాడు. అదృశ్యం కావటానికి ముందు మదన్ వదిలిన ఈ లేఖ చదవగానే కుటుంబ సభ్యులు కాశీకి బయల్దేరారు. తెలుగులో కళ్యాణ్ రామ్ "పటాస్" కు రీమేక్ గా లారెన్స్ హీరోగా తెరకెక్కుతున్న "మొట్ట శివ కెట్ట శివ" సినిమా కి కూడా మదనే నిర్మాత.