Don't Miss!
- News మూడు శుభయోగాలతో ఉగాది ప్రారంభం; మూడు రాశులవారికి అదృష్టం!!
- Sports Mumbai Indians కెప్టెన్సీ మార్పు వెనుక సచిన్.. కొడుకు కోసం రోహిత్పై వేటు!
- Lifestyle మీ బాయ్ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్లో ఈ మార్పులు ఉంటే మిమ్మల్ని చీట్ చేయడానికి పన్నాగం పడుతున్నారని అర్థం జాగ్రత్త
- Technology గూగుల్ క్రోమ్ భద్రత కోసం సరికొత్త ఫీచర్.. వెబ్సైట్లోకి వెళ్లగానే మాల్వేర్ అటాక్లపై అప్రమత్తం చేస్తుంది!
- Automobiles రైలు కదిలేముందు జర్క్ ఎందుకు ఇస్తుంది.??.. ఆసక్తికర విషయాలివే.!!
- Finance IPO News: మార్కెట్లోకి రాకేష్ జున్జున్వాలా ఐపీవో.. డబ్బు రెడీ చేసుకుంటున్న ఇన్వెస్టర్లు..
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
సూసైడ్ నోట్ రాసిపెట్టి వెళ్ళిపోయిన మరో నిర్మాత
కొన్ని నెలలకు ముందే ఒక మళయాల నిర్మాత తన సినిమా రషెస్ చూసుకొని అత్మహత్య కు పాల్పడ్డ సంగతి మర్చిపోక ముందే ఇప్పుడు ఇంకొక నిర్మాత కూడా నష్టాలతో అదే బాట పట్టాడు. అనే కోలీ వుడ్ నిర్మాత "మదన్" ఇంట్లో ఒక సూసైడ్ నోట్ రాసిపెట్టి మరీ ఇంటినుంచి వెళ్ళీపోయాడు..
ఆరవన్ (తెలుగులో ఏకవీర).. లింగా.. పాండియనాడు (పల్నాడు).. పాయుంపులి (జయసింహా) లాంటి భారీ బడ్జెట్ సినిమాల్ని డిస్ట్రిబ్యూట్ చేయడంతో పాటు కొన్ని సినిమాలు నిర్మించిన "వేందార్ మూవీస్" అధినేత అయిన మదన్ ఇలా సుసైడ్ నోట్ పెట్టి కాశీకి వెళ్లిపోయాడు.తాను వెళ్ళిపఓవటానికి కారకులు,కారణాలను పక్కాగా వెళ్ళడించకున్నా ఆర్థిక కారణాలే అని తెలుస్తోంది..
మదన్ ఆధ్వర్యంలోని వేందార్ మూవీస్.. ఎస్ఆర్ఎం గ్రూప్ లో భాగం. ఆ గ్రూప్ అధినేత అయిన పారి వేందార్ ఆరు నెలలుగా మదన్ తో మాట్లాడట్లేదట. ఆయన కుటుంబ సభ్యులు తనను ఓ ద్రోహిలాగా చూస్తున్నారని. పారి వేందార్ ఆస్తులన్నింటినీ తనకు రాసిచ్చేయబోతున్నాడని అనుమానిస్తున్నారని. అందుకే తాను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నానని మదన్ సుసైడ్ నోట్ లో రాశాడు.
ఎస్ఆర్ఎం గ్రూప్ లోని ఎస్ఆర్ఎం యూనివర్శిటీలో చేర్పించడం కోసం తాను విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూలు చేసిన కోట్ల రూపాయల డబ్బు.., వాటి వివరాలన్నీ ఎస్ఆర్ఎం మేనేజ్మెంట్ కు అప్పగించానని. మళ్లీ తాను మరో జన్మ కోరుకోవట్లేదు కాబట్టే కాశీలో చనిపోవాలని నిర్ణయించుకుని అక్కడికి వెళ్లిపోతున్నానని అతను వెల్లడించాడు.
తాను తన జీవితం మొత్తం పారి వేందార్ కోసమే బతికానని. ఇప్పుడు కూడా తనకు ఇష్టమైన వ్యక్తి అయిన ఆయన కోసమే తన ప్రాణాలు అర్పిస్తున్నానని తెలిపాడు. అదృశ్యం కావటానికి ముందు మదన్ వదిలిన ఈ లేఖ చదవగానే కుటుంబ సభ్యులు కాశీకి బయల్దేరారు. తెలుగులో కళ్యాణ్ రామ్ "పటాస్" కు రీమేక్ గా లారెన్స్ హీరోగా తెరకెక్కుతున్న "మొట్ట శివ కెట్ట శివ" సినిమా కి కూడా మదనే నిర్మాత.