twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భీమిలీ..మొదలైంది

    By Staff
    |

    మరో తమిళ రీమేక్ మన ముందుకు రాబోతోంది. కొద్ది నెలల క్రిందట రిలీజైన 'వెన్నెల కబాడీ కులు' అనే తమిళ చిత్రం ఇప్పుడు తెలుగులోకి 'భీమిలి' పేరుతో రీమేక్ అవుతోంది. ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరి సమర్పణలో ఎన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ముహూర్తం ఈరోజు(సోమవారం)ఉదయం సినీ పెద్దల సమక్షంలో రామానాయుడు స్టూడియోస్ లో జరిగింది. అష్టాచెమ్మాతో పరిచయమై రైడ్ చిత్రంతో తానేమిటో నిరూపించుకున్న యువనటుడు నాని ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. అతని సరసన శరణ్య అనే నూతన నటి జంటగా చేస్తోంది. పల్లె నేపధ్యంలో కబ్బాడి ఆట బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం రూపొందింది. సహజ సిద్దమైన భావోద్వేగాలకు ప్రాదాన్యతనిచ్చి ఈ చిత్రాన్ని అక్కడ రూపొందించారు. ఇక ఈ చిత్రంతో సత్య తాతినేని దర్శకుడుగా పరిచయమవుతున్నాడు. అతను టి.ఎల్.వి. ప్రసాద్ కుమారుడు. ఇక రామానాయుడు క్లాప్ కొట్టగా, ఆర్.బి.చౌదరి కెమెరా స్విచ్ ఆన్ చేసి, కె.రాఘవేంద్రరావు మొదటి షాట్ కి దర్శకత్వం వహించారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X