Don't Miss!
- Sports చెన్నై సూపర్ కింగ్స్లో భారీ మార్పులు..!!
- News పవన్ కల్యాణ్ దూకుడు - తాజా నిర్ణయంతో..!!
- Finance IT News: బెంగళూరులో టెక్కీలు సంచలన నిర్ణయం.. అయోమయంలో హౌస్ ఓనర్స్..
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
భీమిలీ..మొదలైంది
మరో తమిళ రీమేక్ మన ముందుకు రాబోతోంది. కొద్ది నెలల క్రిందట రిలీజైన 'వెన్నెల కబాడీ కులు' అనే తమిళ చిత్రం ఇప్పుడు తెలుగులోకి 'భీమిలి' పేరుతో రీమేక్ అవుతోంది. ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరి సమర్పణలో ఎన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ముహూర్తం ఈరోజు(సోమవారం)ఉదయం సినీ పెద్దల సమక్షంలో రామానాయుడు స్టూడియోస్ లో జరిగింది. అష్టాచెమ్మాతో పరిచయమై రైడ్ చిత్రంతో తానేమిటో నిరూపించుకున్న యువనటుడు నాని ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. అతని సరసన శరణ్య అనే నూతన నటి జంటగా చేస్తోంది. పల్లె నేపధ్యంలో కబ్బాడి ఆట బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం రూపొందింది. సహజ సిద్దమైన భావోద్వేగాలకు ప్రాదాన్యతనిచ్చి ఈ చిత్రాన్ని అక్కడ రూపొందించారు. ఇక ఈ చిత్రంతో సత్య తాతినేని దర్శకుడుగా పరిచయమవుతున్నాడు. అతను టి.ఎల్.వి. ప్రసాద్ కుమారుడు. ఇక రామానాయుడు క్లాప్ కొట్టగా, ఆర్.బి.చౌదరి కెమెరా స్విచ్ ఆన్ చేసి, కె.రాఘవేంద్రరావు మొదటి షాట్ కి దర్శకత్వం వహించారు.