Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
తెలుగు చిత్ర పరిశ్రమకి క్షమాపణలు చెప్పుకొన్న తమ్మారెడ్డి భరద్వాజ!
టాలీవుడ్ లో మగాళ్ళు లేరు" అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసి, సినీ పరిశ్రమ ఆగ్రహాన్ని చవిచూసిన తమ్మారెడ్డి భరద్వాజ ఎట్టకేలకు తన వ్యాఖ్యలకుగాను క్షమాపణ చెప్పుకున్నారు. సినీ పరిశ్రమలో అందరూ తనను పెద్దన్నగా భావిస్తారనీ, తన తమ్ముళ్ళు, తన పిల్లలుగా హీరోలను భావించే, వారిపై కాస్తంతా ఘాటుగా కామెంట్ చేశాననీ, తన ఉద్దేశ్యం కొత్త కథలపై హీరోలు మోజు చూపడంలేదనేనని, అంతకన్నా ఎవరిపైనా తనకు కోపం లేదని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు ఓ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో.
తెలుగు సినీ పరిశ్రమ ఇప్పుడిప్పుడే కొత్త దనం వైపు పరుగులు తీస్తోందనీ, చిన్న సినిమాలు కొత్తదనంతో వస్తున్నాయనీ, అలాగే 'మగధీర" వంటి వెరైటీ సినిమా భారీ వసూళ్ళను రాబట్టిందనీ 'సోప్" రాసే ప్రయత్నం చేస్తున్నారు తమ్మారెడ్డి భరద్వాజ. అటు హీరోలూ, దర్శక నిర్మాతలు ఇద్దరూ కష్టపడి తెలుగు సినిమా స్థాయిని పెంచాలని అభిలషించిన తమ్మారెడ్డి భరధ్వాజ, తెలుగు సినీ పరిశ్రమ భారతదేశంలోనే అత్యధికంగా సినిమాలు నిర్మిస్తోందని అన్నారు. సత్తా వున్న హీరోలు, దర్శకులు, నిర్మాతలూ కొత్త దనం వైపు అడుగులు తీస్తే తెలుగు సినిమా పరిశ్రమ అంతర్జాతీయ ఖ్యాతిని పొందుతుందని అభిప్రాయపడ్డారు తమ్మారెడ్డి భరద్వాజ.