Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
వారసులు హీరోలుగా పనికిరారు...తమ్మారెడ్డి భరద్వాజ
చెబితే ఫీలవుతారేమో..నాకు తెలిసి వారసులుగా వచ్చిన వాళ్లెవరూ హీరోలుగా పనికిరారు అని తెగేసి చెప్పారు తమ్మారెడ్డి భరధ్వాజ. ఇప్పుడొస్తున్న వారసులకు నిజంగా హీరోలయ్యే లక్షణాలున్నాయా అంటూ ఓ టీవీ ఛానెల్ వారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన పై విధంగా స్పందించారు. అలాగే వారసత్వంతో పాటు ఎంతో కొంత పనికొచ్చేతనం కనపడింది. ప్రస్తుతం తెలుగులో ఆర్టిస్టులు లేరు. స్టార్స్ ఉన్నారు. వారసత్వంతో చెల్లుబాటు అవుతున్నారు అని చెప్పారు. ఆయన అన్నట్లుగానే ప్రస్తుతం తెలుగులో వారసత్వం హవా నడుస్తోంది. కృష్ణ వారసుడు మహేష్ బాబు, నాగార్జున వారసుడు నాగచైతన్య, రామానాయుడు వారసుడు రానా, సుశాంత్, చిరంజీవి కుటుంబం నుంచి అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ తదితరులు పరిశ్రమలోకి వచ్చారు.
అలాగే సినీ ఇండస్ట్రీ నాలుగు కుటుంబాల గుత్తాధిపత్యంలో ఉందని దాసరి ఇటీవల అన్నారు. ఈ వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా అంటే...అది చాలా సీరియస్ ఇష్యూ. ఓవరాల్గా..ఆయన వ్యాఖ్యలు సమర్థనీయమే. సమస్యకు మూలాలు వెతికి శాశ్వత పరిష్కారం చూడాలి. ఆ ఆలోచన ఎవరూ చేయరు. ఆ నాలుగు కుటుంబాలను ఆపిస్తే సమస్య పరిష్కారమవుతుందా? కాదు. గుత్తాధిపత్యమే లేకుండా చేయడం ముఖ్యం. ఆ కుటుంబాల నుంచి హీరోలు రావడంతో వారి హవా నడుస్తోంది అని చెప్పారు. ఇక ఈ కామెంట్స్ పై మా అద్యక్ష్యుడు మురళీమోహన్ ఇప్పటికే మండిపడుతూ స్టేట్ మెంట్ ఇచ్చారు.