Don't Miss!
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- News ఎన్నికల వేళ ధర్మవరం లో నువ్వా -నేనా, సై..!!
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
వారసులు హీరోలుగా పనికిరారు...తమ్మారెడ్డి భరద్వాజ
చెబితే ఫీలవుతారేమో..నాకు తెలిసి వారసులుగా వచ్చిన వాళ్లెవరూ హీరోలుగా పనికిరారు అని తెగేసి చెప్పారు తమ్మారెడ్డి భరధ్వాజ. ఇప్పుడొస్తున్న వారసులకు నిజంగా హీరోలయ్యే లక్షణాలున్నాయా అంటూ ఓ టీవీ ఛానెల్ వారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన పై విధంగా స్పందించారు. అలాగే వారసత్వంతో పాటు ఎంతో కొంత పనికొచ్చేతనం కనపడింది. ప్రస్తుతం తెలుగులో ఆర్టిస్టులు లేరు. స్టార్స్ ఉన్నారు. వారసత్వంతో చెల్లుబాటు అవుతున్నారు అని చెప్పారు. ఆయన అన్నట్లుగానే ప్రస్తుతం తెలుగులో వారసత్వం హవా నడుస్తోంది. కృష్ణ వారసుడు మహేష్ బాబు, నాగార్జున వారసుడు నాగచైతన్య, రామానాయుడు వారసుడు రానా, సుశాంత్, చిరంజీవి కుటుంబం నుంచి అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ తదితరులు పరిశ్రమలోకి వచ్చారు.
అలాగే సినీ ఇండస్ట్రీ నాలుగు కుటుంబాల గుత్తాధిపత్యంలో ఉందని దాసరి ఇటీవల అన్నారు. ఈ వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా అంటే...అది చాలా సీరియస్ ఇష్యూ. ఓవరాల్గా..ఆయన వ్యాఖ్యలు సమర్థనీయమే. సమస్యకు మూలాలు వెతికి శాశ్వత పరిష్కారం చూడాలి. ఆ ఆలోచన ఎవరూ చేయరు. ఆ నాలుగు కుటుంబాలను ఆపిస్తే సమస్య పరిష్కారమవుతుందా? కాదు. గుత్తాధిపత్యమే లేకుండా చేయడం ముఖ్యం. ఆ కుటుంబాల నుంచి హీరోలు రావడంతో వారి హవా నడుస్తోంది అని చెప్పారు. ఇక ఈ కామెంట్స్ పై మా అద్యక్ష్యుడు మురళీమోహన్ ఇప్పటికే మండిపడుతూ స్టేట్ మెంట్ ఇచ్చారు.