twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ డుమ్మా: తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: అప్పుడప్పుడు మీడియా ముందుకొచ్చి సంచలన వ్యాఖ్యలు చయడం, పరోక్షంగా సెటైర్లు వేయడం ప్రముఖ తెలుగు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజకు అలవాటు. తాజాగా మరోసారి ఆయన అలాంటి వ్యాఖ్యలే చేసారు. ఫిల్మ్ ఫేర్ అవార్డులకైతే మన హీరోలు ఎగేసుకెళతారు, నంది వార్డులకైతే రారు. ఒక మంచి పని కోసం టాలీవుడ్ మొత్తం కలిసి ‘మేము సైతం' కార్యక్రమం చేసాం. ఇలాంటి కార్యక్రమాల్లో అందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలి. కానీ కొందరు హీరోలను బ్రతిమిలాడుకునే పరిస్థితి ఏర్పడింది. చిత్తూరులో గాయకుడు బాలసుబ్రహ్మణ్యం ఒక్కరే గంట ఫ్రోగ్రాం చేస్తే కోటి వచ్చింది. సినీ పరిశ్రమ మొత్తం కలిసి ‘మేముసైతం' చేసినా రూ. 8 కోట్లు రాలేదు అన్నారు తమ్మారెడ్డి.

    Tammareddy

    సినీ ఇండస్ర్టీలోని హీరోయిన్లపై కూడా నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు స్టార్‌ హీరోయిన్స్‌ నైట్‌ పార్టీల మీద చూపిన ఆసక్తి తుపాను బాధితుల కోసం నిర్వహించిన మేము సైతం కార్యక్రమం మీద చూపకపోవడం బాధాకరమన్నారు. మేము సైతం కార్యక్రమాన్ని తెలుగు డ్యాన్సర్లతోనే జరపడం అభినందనీయమని తమ్మారెడ్డి కొనియాడారు.

    కాగా...తమ్మారెడ్డి వ్యాఖ్యలు ‘మేము సైతం' కార్యక్రమానికి హాజరు కాని వారి గురించే అని స్పష్టం అవుతోంది. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్‌తో పాటు మరికొందరు స్టార్స్ గైర్హాజరైన సంగతి తెలిసిందే. గతంలోనూ తమ్మారెడ్డి టాలీవుడ్ హీరోలపై పలు సంచలన వ్యాఖ్యలు చేసారు. మన హీరోలకు ప్రయోగాత్మక చిత్రాలు తీసే దమ్ము లేదని వ్యాఖ్యనించారు.

    English summary
    Tammareddy Bharadwaja sensation comments about Tollywood stars.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X