Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఆ దారిలోనే నడవండి.. అనాధలమయ్యాం.. చిరంజీవికి తమ్మారెడ్డి ఝలక్
ప్రముఖ దర్శకుడు, దివంగత దాసరి నారాయణరావు జీవితంలోని కొన్ని విశేషాలను, ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు తెచ్చుకొంటూ అందించిన పుస్తకం తెర వెనుక దాసరి. ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు చిరంజీవి, రాఘవేంద్రరావు, సుబ్బిరామిరెడ్డి, మురళీమోహన్ రావు, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి ఉద్వేగంగా ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే..
Recommended Video
దాసరి మరణం తర్వాత
దాసరి మరణించిన తర్వాత చిత్ర పరిశ్రమలో తాము అనాధలుగా మారామనే ఫీలింగ్ ఏర్పడింది. ఈ సినిమా పరిశ్రమలో సమస్యల పరిష్కారానికి ఎవరూ పూనుకొంటారు అనే అనుమానం తలెత్తింది.
దాసరి తర్వాత చిరంజీవియే..
చిరంజీవి గారు మెగాస్టార్. చిత్ర పరిశ్రమకు సంబంధించి దాసరి నారాయణరావు గారి తర్వాత ఆయనే. పరిశ్రమ అభివృద్ధికి దాసరి ఎలా అయితే కృషి చేశారో.. అలానే చిరంజీవి ముందుకు రావాలి. చిత్ర పరిశ్రమకు సంబంధించిన కార్యక్రమాలను చిరంజీవి నెత్తిన వేసుకోవాలి అని కోరుకొంటున్నాను.
అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ..
పరిశ్రమలో వ్యక్తుల మధ్య అనేక బేధాభిప్రాయాలు ఉంటాయి. మన మధ్య ఎన్నో ఉంటాయి. కానీ పరిశ్రమ అంటే అవన్నీ పక్కన పెట్టాలి. దాసరి గారికి కొంత మందితో విభేదాలు ఉండేవి. కానీ అవేమీ ఆయన పట్టించుకోకుండా సమస్యల పరిష్కారానికి నడం బిగించేవారు.
దాసరి బాటలో చిరంజీవి
దాసరి గారి బాటలో చిరంజీవి నడువాలి. దాసరి చేపట్టినట్టుగానే చిరంజీవిగారు కార్యక్రమాలను కొనసాగించాలి. చిరంజీవి కూడా అంత ఓర్పుతో దాసరి ఆకాంక్షలను నెరవేర్చాలి. నెరవేరుస్తారు అని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.
చిరంజీవికి థ్యాంక్స్
తెర వెనుక దాసరి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్న చిరంజీవి, అల్లు అరవింద్, సుబ్బిరామిరెడ్డికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ద్వారా మరోసారి అందరి కలుపడమే కాకుండా మళ్లీ దాసరిని గుర్తు చేశాడు.
ఆయనతో అనుబంధం
ఇక తెర వెనుక దాసరి పుస్తకంలో దాసరితో ఉన్న అనుబంధాన్ని తమ్మారెడ్డి భరద్వాజ అక్షరరూపంలో వెలువరించారు. చిత్ర పరిశ్రమకు సంబంధించిన ఏ కార్యక్రమమైనా, ఏ సమస్య వచ్చినా భరద్వాజకు ఫోన్ చేయమనేవారట. ఆయనకు సమగ్రమైన అవగాహన కలిగి ఉంటారు అని చెప్పేవారట. సినిమా పరిశ్రమలో దాసరితో అలాంటి అనుబంధం ఏర్పడటం నాకు చాలా గర్వంగా ఉంటుంది
దాసరి స్పందించిన తీరు
నేను చిరంజీవితో కోతల రాయుడు సినిమా తీస్తున్న సమయంలో దాసరిగారంటే ఇండస్ట్రీ.. ఇండస్ట్రీ అంటే దాసరి గారు. కోతలరాయుడు తర్వాత మొగుడు కావాలి చిత్రాన్ని తీసాను. ఆ చిత్ర రిలీజ్ విషయంలో నేను చాలా ఇబ్బంది పడ్డాను. అప్పుుడు దాసరిగారు స్పందించి నాకు సహాయం చేసింది. అప్పటి నుంచి మా మధ్య అనుబంధం బాగా బలపడింది అని అని తమ్మారెడ్డి భరద్వాజ పుస్తకంలో పేర్కొన్నారు.