Don't Miss!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అలాంటప్పుడు తెలుగువాళ్ళం అని చెప్పుకోకండి: తనికెళ్ల భరణి
పోతన పద్యాలు కనీసం 10 అయినా రాకపోతే తెలుగువాళ్లమని చెప్పుకోవడం మానేయండి!
పోతన పద్యాలు కనీసం 10 అయినా రాకపోతే తెలుగువాళ్లమని చెప్పుకోవడం మానేయండి! కనీసం, ఆ పద్యాలను ముట్టుకోండి, పుణ్యం వస్తుందని నా ఉద్దేశం అంటూ అభిప్రాయ పడ్డారు తనికెళ్ళ భరణి
ఆక్సిజన్ లేకపోయినా బతకగలనేమో గానీ, పుస్తకాలు లేకపోతే మాత్రం బతకలేనేమోనని అనిపిస్తుంటుందని ప్రముఖ నటుడు, మాటల రచయిత తనికెళ్ల భరణి అన్నారు. తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఓ వీడియోలో ఆయన మాట్లాడుతూ, 'పుస్తకం మంచి స్నేహితుడు అనే నానుడి ఉంది.
పది పుస్తకాలు పడేసి గడిపెయ్యమంటే గడిపేస్తాను. ఆ స్థితిని దయచేసి, యువత డెవలప్ చేసుకోవాలి. పూర్వం మన ఇళ్లల్లో భారత, భాగవతాలు చదువుతుండేవారు .. వింటుండేవారు.టైంపాస్ కోసం, భక్తి కోసం, జీవన విధానం కోసం ... కావ్యాలు చదివేవారు. పూర్వం .. కనీసం 10 నుంచి 100 పద్యాలు రాని తెలుగు ఇల్లు ఉండేది కాదు.
పోతన భాగవతం .. ద్రాక్షపాకం. ఆ పద్యాలు చదువుతుంటే తనివి తీరదు. పోతన పద్యాలు కనీసం 10 అయినా రాకపోతే తెలుగువాళ్లమని చెప్పుకోవడం మానేయండి! కనీసం, ఆ పద్యాలను ముట్టుకోండి, పుణ్యం వస్తుందని నా ఉద్దేశం. పోతన భాగవతం .. ఆధ్యాత్మికం, రసాత్మకం. ఈ రెండింటీకి ఉపయోగపడుతుంది. పోతన భాగవతం చదివితే దైవం సాక్షాత్కారం అయిపోతుంది' అని భరణి అభిప్రాయపడ్డారు.