Don't Miss!
- Sports SRH vs RCB: మలుపు తిప్పిన స్వప్నిల్ సింగ్.. సన్రైజర్స్ హైదరాబాద్పై ఆర్సీబీ ఘన విజయం!
- News ఘోర ప్రమాదం: లారీని ఢీకొనడంతో చిన్నారి సహా ఆరుగురు మృతి
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అలాంటప్పుడు తెలుగువాళ్ళం అని చెప్పుకోకండి: తనికెళ్ల భరణి
పోతన పద్యాలు కనీసం 10 అయినా రాకపోతే తెలుగువాళ్లమని చెప్పుకోవడం మానేయండి!
పోతన పద్యాలు కనీసం 10 అయినా రాకపోతే తెలుగువాళ్లమని చెప్పుకోవడం మానేయండి! కనీసం, ఆ పద్యాలను ముట్టుకోండి, పుణ్యం వస్తుందని నా ఉద్దేశం అంటూ అభిప్రాయ పడ్డారు తనికెళ్ళ భరణి
ఆక్సిజన్ లేకపోయినా బతకగలనేమో గానీ, పుస్తకాలు లేకపోతే మాత్రం బతకలేనేమోనని అనిపిస్తుంటుందని ప్రముఖ నటుడు, మాటల రచయిత తనికెళ్ల భరణి అన్నారు. తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఓ వీడియోలో ఆయన మాట్లాడుతూ, 'పుస్తకం మంచి స్నేహితుడు అనే నానుడి ఉంది.
పది పుస్తకాలు పడేసి గడిపెయ్యమంటే గడిపేస్తాను. ఆ స్థితిని దయచేసి, యువత డెవలప్ చేసుకోవాలి. పూర్వం మన ఇళ్లల్లో భారత, భాగవతాలు చదువుతుండేవారు .. వింటుండేవారు.టైంపాస్ కోసం, భక్తి కోసం, జీవన విధానం కోసం ... కావ్యాలు చదివేవారు. పూర్వం .. కనీసం 10 నుంచి 100 పద్యాలు రాని తెలుగు ఇల్లు ఉండేది కాదు.
పోతన భాగవతం .. ద్రాక్షపాకం. ఆ పద్యాలు చదువుతుంటే తనివి తీరదు. పోతన పద్యాలు కనీసం 10 అయినా రాకపోతే తెలుగువాళ్లమని చెప్పుకోవడం మానేయండి! కనీసం, ఆ పద్యాలను ముట్టుకోండి, పుణ్యం వస్తుందని నా ఉద్దేశం. పోతన భాగవతం .. ఆధ్యాత్మికం, రసాత్మకం. ఈ రెండింటీకి ఉపయోగపడుతుంది. పోతన భాగవతం చదివితే దైవం సాక్షాత్కారం అయిపోతుంది' అని భరణి అభిప్రాయపడ్డారు.