Don't Miss!
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Sports చెన్నై సూపర్ కింగ్స్లో భారీ మార్పులు..!!
- News పవన్ కల్యాణ్ దూకుడు - తాజా నిర్ణయంతో..!!
- Finance IT News: బెంగళూరులో టెక్కీలు సంచలన నిర్ణయం.. అయోమయంలో హౌస్ ఓనర్స్..
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
నా కొడుకు నన్ను ఓడిస్తాడు...తణికెళ్ళ భరణి
కుమారుని చేతిలో ఓడిపోవడం ఓ వరం. నటనలో నా కుమారుడు నన్ను ఓడించాలని మనసారా కోరుకుంటున్నా. ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుంది అన్నారు తణికెళ్ళ భరణి.క్యారెక్టర్ ఆర్టిస్టు, రచయిత తనికెళ్ళ భరణి కుమారుడు తేజ తనికెళ్ల హీరో అయ్యారు.ఆర్.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై చలపతి మల్లాది దర్శకత్వంలో ఎ.కె.సాయికుమార్ నిర్మిస్తున్న 'మిస్టర్ లవంగం' చిత్రం ఆడియో సీడీలను హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో మధుర ఎంటర్టైన్మెంట్ మ్యూజిక్ ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా తనికెళ్ల భరణి తన ఆనందాన్ని ఇలా వ్యక్తం చేసారు.
ఈ చిత్రంలో హీరోయిన్ గా సింధు పరిచయమవుతోంది.బ్రహ్మానందం, క్రిష్ణ భగవాన్, చలపతిరావు, సుమన్శెట్టి, మెల్కోటి, రంగనాథ్, కొండవలస, గౌతంరాజు, ఛత్రపతి శేఖర్, పృథ్వీ, ధన్రాజ్, రాజేంద్ర, ఇంటూరి వాసు, పూర్ణిమ, పావల శ్యామల, ఉమ, అను,సంధ్య, మధుర, వనిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎ.కె.రిషాల్ సాయి, కో-ప్రొడ్యూసర్:జి.కె.కిశోర్, ఫొటోగ్రఫీ: టి.రాజేంద్ర, ఎడిటర్: నందమూరి హరి: రచన, దర్శకత్వం: చలపతి మల్లాది.