Don't Miss!
- Sports ధోనీ సార్ ధోనీ.. అంతే: సౌండ్ లెవెల్ ఏ రేంజ్లో ఉందంటే..
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
‘మేం వయసుకు వచ్చాం’ ఈ నెల 23న
ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈచిత్రం క్లీన్ 'యు' సర్టిఫికెట్ను పొందింది. ప్రముఖ దర్శకుడు, నటుడు భాగ్యరాజా ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 23న విడుదలవుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాతలు బెక్కెం వేణుగోపాల్, లక్ష్మణ్ క్యాదారి, దర్శకుడు త్రినాధరావు నక్కిన, సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర, బెంగుళూరు డిస్ట్రిబ్యూటర్ అర్జున్, కథా రచయితలు నివాస్, ఉదయ్ భాగవతుల తదితరులు పాలు పంచుకున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ...'సెన్సార్ నుంచి క్లీన్ యూ సర్టిఫికెట్ అందుకోవడం తమ చిత్రం సాధించిన తొలి విజయంగా పేర్కొన్నారు. సినిమా టైటిల్ బట్టి ఇదేదో కుర్రాళ్లు మాత్రమే చూడదగ్గ చిత్రమనే అపోహను సెన్సార్ వారు ఇచ్చిన క్లీన్ సర్టిఫికెట్ తొలగించిందని వారు అభిప్రాయపడ్డారు. ప్రేమలోని ఒక కొత్త కోణాన్ని సరికొత్తగా ఆవిష్కరిస్తూ 'మేం వయసుకు వచ్చాం' అన్ని వయసుల వారిని అలరిస్తుందని, శేఖర్ చంద్ర అందించిన సంగీతం ఈ చిత్రానికి ఆయువు పట్టుగా నిలుస్తుందని, తనీష్ కెరీర్లోనే చాలా గర్వంగా చెప్పుకోదగ్గ చిత్రంగా ఇది రూపుదిద్దుకుందని, భాగ్యరాజా పోషిస్తున్న ప్రత్యేక పాత్ర ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అని తెలిపారు.
కాశీవిశ్వనాథ్, సూర్య, తాగుబోతు రమేష్, ధనరాజ్, రక్ష ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈచిత్రానికి సంగీతం: శేఖర్ చంద్ర, పాటలు: భాస్కరభట్ల రవికుమార్, ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్, కూర్పు: పూడి ప్రవీణ్, నృత్యాలు: స్వర్ణ, కళ: వర్మ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కౌషీన్ మహ్మద్ సిద్ధిఖి.