twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్ ఫస్ట్ బ్రేక్ రంగం తో జీవా ‘వచ్చాడు..గెలిచాడు'

    By Sindhu
    |

    టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఆర్ బి చౌదరి తనయుడు పాపులర్ తమిళ యాక్టర్ జీవా కథానాయకుడిగా తమిళంలో రూపొందిన 'వందాన్ వెంద్రాన్" చిత్రాన్ని కె.వి.ఫిల్మ్స్ సంస్థ 'వచ్చాడు గెలిచాడు" పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. కె.వి.వి.సత్యనారాయణ నిర్మాత. తాప్సీ కథానాయిక. ప్రస్తుతం ఈ చిత్రం అనువాద కార్యక్రమాల్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ 'జీవితంలో గొప్ప లక్ష్యాన్ని కలిగిన ఓ యువకుడు దాన్ని చేరుకోవడానికి ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా వుంటాడు. అలా ఆశయమే ఊపిరిగా బ్రతికే యువకుడి కథే మా చిత్రం".

    టాలీవుడ్ ఫస్ట్ బ్రేక్ 'రంగం" ఇరవై సెంటర్స్ లో వందరోజులకు చేరువలో వుంది. రంగం తర్వాత జీవా మరో విలక్షణ పాత్రలో ఇందులో కనిపిస్తాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. థమన్ మెలోడీ ప్రధానంగా చక్కటి బాణీలను అందించాడు. గోవా, స్విట్జర్లాండ్‌ లలో పాటల్ని చిత్రీకరించాం. సినిమాలోని కీలక ఎపిసోడ్‌ ను ముంబయ్‌ లో చిత్రీకరించాం. ఈ నెల రెండోవారంలో ఆడియో విడుదల చేసి సెప్టెంబర్‌ లో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు. ఈ చిత్రానికి తెలుగు డబ్బింగ్ రైట్స్ తెచ్చిన కెవివి సత్యనారాయణ సారథ్యం లో కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆర్.కణ్ణన్.

    English summary
    Jeeva, popular Tamil actor and younger son of producer RB Chowdary has got his first break in Tollywood with Rangam, which is running towards hundred days in twenty plus centers. With Rangam's success many more Jeeva movies are now being dubbed in Telugu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X