Don't Miss!
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పూరీ జగన్నాధ్ చిత్రం ఎందుకు రిజెక్టు చేసానంటే?: తాప్సీ
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో హిందీలో అమితాబ్కు జంటగా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి..అయితే కాల్షీట్స్ సమస్య కారణంగా తాను అంగీకరించలేదని తాప్సీ చెప్పింది. అమితాబ్ లాంటి గొప్ప నటుడితో నటించాలనే కోరిక ఏ హీరోయిన్కైనా ఉంటుందన్నారు. అలాంటి అవకాశం వచ్చినా వదులుకోవాల్సి రావడం బాధ కలిగించిందని వివరణ ఇచ్చింది. అమితాబ్ తో పూరి రూపొందించనున్న చిత్రం టైటిల్ బుడ్డ. ఆ చిత్రంలో ఆమె సోనూసూద్ సరసన చేయమని అడిగారు. ఇక ఈ బుడ్డ చిత్రం పిబ్రవరి 23వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అలాగే చిరుత ఫేమ్ నేహాశర్మ కూడా ఈ చిత్రంలో ఓ ప్రధానపాత్ర ఫోషించనుంది. ఇక అమితాబ్ కి జంటగా టబు కనిపించనుంది. ఇంతకు ముందు వీరిద్దరు కాంబినేషన్ లో చీనికామ్ చిత్రం వచ్చి విజయవంతమైంది. ప్రస్తుతం పూరి జగన్నాధ్...రానా, ఇలియానాలు కాంబినేషన్లో "నేను నా రాక్షసి" చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆ తర్వాత మహేష్, పూరీ కాంబినేషన్ లో ది బిజినెస్ మెన్ చిత్రం రూపొందనుంది.