మహత్ రాఘవేంద్రతో ఎఫైర్ విషయమై తాప్సీ...
తాప్సీ హీరోయిన్ గా నటించిన 'గుండెల్లో గోదారి' చిత్రం ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. చిత్రం ప్రమేషన్ లో భాగంగా ఆమె మీడియాను కలిసింది. అలాగే తాజాగా నాకు వరుణ్ ధావన్కీ మధ్య ప్రేమాయణం జరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏదో ఒక రోజు ఓ కప్పు కాఫీ కలిసి తాగామంతే. అంతమాత్రానికే మా మధ్య ప్రేమాయణం సాగుతుందంటే ఎలా? (నవ్వుతూ) ఇలా ఓ కప్పు కాఫీ నా జీవితాన్నే మార్చేస్తుంది అనుకోలేదు అంది. అయినా నాకు నా తల్లిదండ్రుల సపోర్ట్ ఉంది. నేనేంటో వాళ్లకు తెలుసు. అందుకే ఈ పుకార్లను పెద్ద పట్టించుకోను. పైగా నా గురించి తెలుసుకోవడానికి ఇంత ఆసక్తిని కనబరుస్తున్నారంటే... నేను కొంత వరకు సాధించినట్లేకదా అని వివరించింది.
ఇక గుండెల్లో గోదారి చిత్రం గురించి చెప్తూ... ''ఈ చిత్రంలో ఆదికీ నాకూ మధ్య సాగే ఓ గీతం కాస్త ఘాటుగానే ఉంటుంది. ఆ పాటలో నటించడానికి మొదట నేను భయపడ్డాను. ఇలాంటివి చేయడం నావల్ల కాదని కూడా దర్శకుడు కుమార్ నాగేంద్రతో చెప్పేశాను. ఆ పాటలో బెడ్ సీన్స్ చేయడంలో ఆది సహకారమే కీలకం. సన్నివేశం పూర్తయ్యాకా బుద్ధిగా చొక్కా వేసుకుని ఓ మూలన కూర్చొనేవాడు. ఆ పాట అంత బాగా వచ్చిందంటే కారణం ఆదియే'' అంది.
ఇక ఆది నేను సైకిల్పై సినిమాకి వెళ్లే సన్నివేశం తీసేటప్పుడు జనం చాలామంది వచ్చారు. ఎంతో ఆప్యాయంగా పలకరించారు. ఆ క్షణంలో ఎంతో ఆనందం కలిగింది. నాకు చేపల వాసనంటేనే పడదు. వాటిని శుభ్రం చేసే సన్నివేశం చేసేటప్పుడు ఇబ్బందిపడ్డాను. గోదావరి ప్రాంత ప్రజలు ఎంతో ప్రేమగా రకరకాల చేప వంటకాలు తెచ్చేవారు. నాకు ఇష్టం లేకపోయినా లక్ష్మీప్రసన్న బలవంతంగా తినిపించేది అంటూ చెప్పుకొచ్చింది తాప్సీ.


Click it and Unblock the Notifications












