Don't Miss!
- Finance Bitcoin Crash: భారీగా పతనమైన బిట్కాయిన్.. ఇండియాకి బినాన్స్ తిరిగి ఎంట్రీ..
- News చంద్రబాబు, రేవంత్ రెడ్డి మరోమారు కుమ్మక్కు: ఓటుకు నోటు కేసుపై ఎమ్మెల్యే ఆర్కే సంచలనం
- Technology 24GB వరకు RAM, 50MP సెల్ఫీ కెమెరా, మూడు 50MP వెనక కెమెరాలతో కొత్త ఫోన్ లాంచ్!
- Lifestyle Gruha Pravesham Wishe in Telugu : గృహప్రవేశం శుభాకాంక్షలను ఇలా తెలపండి..
- Sports ధోనీని ఒప్పించడం కష్టమే..ఆ ఫేక్ న్యూస్ నమ్మొద్దు- రోహిత్
- Automobiles జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
యమధర్మరాజుగా తారకరత్న
హైదరాబాద్: నందమూరి తారకరత్న తొలిసారిగా ఓ సోషియో ఫాంటసీ సినిమా చేయబోతున్నారు. ఇందులో ఆయన యమధర్మరాజుగా నటించబోతున్నారు. వెంకట్ పంపన దర్శకుడిగా పరిచయం కానున్నారు. శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఫిలిమ్స్ పతాకంపై నందన్ గౌడ్ ఈచిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించబోతున్నారు. విజయదశమి రోజున ఈ సినిమా ముహూర్తం జరుపుకోనుంది.
నిర్మాత నందన్ గౌడ్ చిత్రం విశేషాలను వివరిస్తూ 'తారకరత్నతో విభిన్న తరహాలో సోషియో ఫాంటసీ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. కథ చాలా బాగా వచ్చింది. రంభ, ఊర్వశి, మేనకగా ఇందులో ప్రముఖ తారలు కనిపిస్తారు. 'నేను నా రాక్షసి' ఫేం రెహమాన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తారు' అన్నారు.
అజయ్, రాజీవ్, మురళీ మోహన్, శరత్ బాబు, సుమలత, తనికెళ్ల భరణి, వేణుమాధవ్, తెలంగాణ శంకుతల, వెంకట్, తాగుబోతు రమేష్, ప్రభాస్ శ్రీను, శ్రీనివాసరెడ్డి తదితరులు నటించనున్న ఈచిత్రానికి కెమెరా: కెకె హనుమంతు, ఎడిటింగ్: నందమూరి హరి, సమర్పణ: లక్ష్మీ మల్లాగౌడ్, నిర్మాత: నందన్ గౌడ్, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: వెంకట్ పంపన.
నందమూరి హీరో తారకరత్న ప్రస్తుతం 'మైక్ టెస్టింగ్ 123' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ చిత్ర పతాకంపై నిర్మిస్తోన్న ఈ సినిమాకి వీరు.కె దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. తారకరత్న జోడీగా అర్చన నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఈచిత్రంలో దేవానందం అనే డ్రామా డైరెక్టర్ గా నటిస్తున్నాడు తారకరత్న. ఈచిత్రంలో తను వేసిన డ్రామాలో గబ్బర్ సింగ్ చిత్రంలోని 'కెవ్వుకేక సాంగు'పై డాన్స్ చేయిస్తాడట తారకరత్న. తొలిసారిగా ఆయన ఈ సినిమాలో కామెడీని పండించబోతున్నాడు.
తారకరత్న ప్రస్తుతం 'విజేత' అనే మరో కూడా నటిస్తున్నారు. పి ఉదయ భాస్కర్ దర్శకత్వం వహించబోతున్న ఈ చిత్రాన్ని వి దొరస్వామి రాజు నిర్మిస్తున్నారు. సంజన మరియు శ్వేత బసు ప్రసాద్ ఈ చిత్రంలో కథానాయికలుగా కనిపించనున్నారు. ఇదొక త్రికోణ ప్రేమకథ. ఇద్దరు అమ్మాయిలు ఒకే అబ్బాయిని ప్రేమిస్తారు తరువాత జరిగే పరిణామాలను అతను ఎలా ఎదుర్కున్నాడు అనేది ఈ చిత్ర కథ. ఈ చిత్రం రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్" అని తారకరత్న తెలిపారు. అర్జున్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం జూలైలో చిత్రీకరణ మొదలు పెట్టుకోనుంది.