Don't Miss!
- News కాంగ్రెస్ సర్కారును టచ్ చేస్తే..: బీజేపీ, బీఆర్ఎస్లకు సీఎం రేవంత్ హెచ్చరిక
- Sports LSG vs CSK: ధోనీ పవర్ హిట్టింగ్.. మెరిసిన జడేజా
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
తరుణ్ మరో 'ప్రేమకథ'
'శశిరేఖా పరిణయం' చిత్రం తర్వాత కొంత విరామం తీసుకున్న తరుణ్ తాజాగా ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సారి ఆయన 'ఎవరైనా ఎపుడైనా' ఫేం విమలా రామన్ తో జతకట్టారు. 'మనసంతా నువ్వే' లాంటి సున్నితమైన ప్రేమకథను తెరకెక్కించిన వి.యన్.ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇన్నాళ్లు ఆడియో క్యాసెట్ల పంపినీలో ప్రముఖంగా వినిపించిన సుప్రీమ్ సంస్థ వారు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఇటీవలే బ్యాంకాక్ లో ఓ షెడ్యూల్ ని పూర్తిచేసుకున్న ఈ చిత్రం విశేషాలను నిర్మాత సుప్రీమ్ రాజు, గోగినేని శ్రీనివాస్ తెలియజేస్తూ "సున్నితమైన ప్రేమకథకు అన్ని రకాల అంశాలను మేళవించి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. లవర్ బాయ్ ఇమేజ్ వున్న తరుణ్ కు వందశాతం సరిపోయే కథ ఇదని తెలిపారు. బ్యాంకాక్ లో జరిగిన షెడ్యూల్ తో ముప్పైశాతం సినిమా పూర్తయిందని, తదుపరి షెడ్యూల్ హైదరాబాదు లో ప్రారంభించనున్నామని" తెలిపారు. ఎన్నో రోజులుగా ఓ హిట్ కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తున్న తరుణ్ ఈ చిత్రం పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు.