twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తరుణ్ మరో 'ప్రేమకథ'

    By Staff
    |

    'శశిరేఖా పరిణయం' చిత్రం తర్వాత కొంత విరామం తీసుకున్న తరుణ్ తాజాగా ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సారి ఆయన 'ఎవరైనా ఎపుడైనా' ఫేం విమలా రామన్ తో జతకట్టారు. 'మనసంతా నువ్వే' లాంటి సున్నితమైన ప్రేమకథను తెరకెక్కించిన వి.యన్.ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇన్నాళ్లు ఆడియో క్యాసెట్ల పంపినీలో ప్రముఖంగా వినిపించిన సుప్రీమ్ సంస్థ వారు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

    ఇటీవలే బ్యాంకాక్ లో ఓ షెడ్యూల్ ని పూర్తిచేసుకున్న ఈ చిత్రం విశేషాలను నిర్మాత సుప్రీమ్ రాజు, గోగినేని శ్రీనివాస్ తెలియజేస్తూ "సున్నితమైన ప్రేమకథకు అన్ని రకాల అంశాలను మేళవించి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. లవర్ బాయ్ ఇమేజ్ వున్న తరుణ్ కు వందశాతం సరిపోయే కథ ఇదని తెలిపారు. బ్యాంకాక్ లో జరిగిన షెడ్యూల్ తో ముప్పైశాతం సినిమా పూర్తయిందని, తదుపరి షెడ్యూల్ హైదరాబాదు లో ప్రారంభించనున్నామని" తెలిపారు. ఎన్నో రోజులుగా ఓ హిట్ కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తున్న తరుణ్ ఈ చిత్రం పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X