'సుప్రీం' హీరో... తరుణ్

బాలీవుడ్ సూపర్ హిట్ 'సర్ఫరోష్' కి కాపీగా వచ్చిన ఆ సినిమా డిజాస్టర్ గా భాక్సాఫిస్ వద్ద మిగిలింది. దాంతో వరసగా సినిమాలు తీద్దామనుకున్న సుప్రీమ్ వారు ఆగారు. మళ్ళీ ఇప్పుడు తరుణ్ తో రంగంలోకి దిగుతున్నారు. ఇక 'ఓ చినదానా' వంటి కామిడీలను అందించి ఈ మధ్య కాస్త వెనుకపడ్డ ఇ.సత్తిబాబు దీనికి దర్శకుడు. 'భలే దొంగలు' తో తిరిగి ఎంట్రీ ఇచ్చిన తరుణ్ ప్రస్తుతం కృష్ణ వంశి దర్శకత్వంలో 'జర్నీ' అనే సినిమాను చేస్తున్నాడు. ఇక ఈ కొత్త సినిమా పూర్తి స్ధాయి ఎంటర్ టైన్ మెంట్ తో నవ్విస్తుందని చెపుతున్నారు.


Click it and Unblock the Notifications











