Don't Miss!
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- News నా తల్లి మంగళసూత్రమిస్తే, అమ్మమ్మ బంగారమిచ్చింది-మోడీకి ప్రియాంక ఘాటు కౌంటర్..!
- Sports Sachin Tendulkar: కన్నీటిని ఆపుకుంటూ సెంచరీ!
- Technology జియో సినిమా యాప్లో IPL మ్యాచ్లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మంచి సినిమా అంటూ కేసీఆర్ ప్రశంస.. పన్ను రాయితీ!
హైదరాబాద్: ప్రజ్వల సంస్థ వ్యవస్థాపకురాలు సునీత కృష్ణన్ నిర్మాణంలో ప్రజ్వల సమర్పణలో సన్ టచ్ ప్రొడక్షన్స్ పతాకంపై అంజలి పాటిల్, సిద్ధికీ, లక్ష్మీ మీనన్, రత్నశేఖర్ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘నా బంగారు తల్లి'. సునీత కృష్ణన్, ఎంఎస్. రాజేష్ నిర్మాతలు. రాజేష్ టచ్ రివర్ దర్శకుడు.
ఇప్పటికే మూడూ జాతీయ అవార్డలను అనేక అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్న ఈ చిత్రం ఇటీవల విడుదలై మంచి టాక్ తో రన్ అవుతుంది. హ్యూమన్ ట్రాఫికింగ్ అనే అంశంపై తెరకెక్కిన ఈ చిత్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పన్ను రాయితీ ప్రకటించింది.
ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ...‘నా బంగారు తల్లి చిత్రాన్ని సమాజానికి మంచి అందించే ఉద్దేశ్యంతో తీసారు. అమ్మాయిలను వ్యభిచారంలోకి దింపే దురాచారాన్ని వ్యతిరేకిస్తూ.... ప్రస్తుత సమాజంలో స్త్రీలకు ఎలాంటి అన్యాయాలు జరుగుతున్నాయనేది ఈ చిత్రంలో చూపించారు అన్నారు.
ఈ చిత్రాన్ని ఎక్కువ భాగం హైదరాబాద్లో చిత్రీకరించారు, ఇటువంటి సినిమాలను ప్రొత్సహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విడుదలకు ముందే మూడు జాతీయ, అనేక అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్న ఈ చిత్రాన్ని పన్ను రాయితీ ప్రకటిస్తున్నాం' అన్నారు.