నేనొక టిబి రోగిని: షాకింగ్ సీక్రెట్ బయట పెట్టిన మెగాస్టార్!
హైదరాబాద్: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తాజాగా ఓ షాకింగ్ న్యూస్ బయట పెట్టారు. కొన్ని రోజుల క్రితం వరకు తాను టీవీ(క్షయ వ్యాధి)తో బాధ పడ్డానని...అయితే ప్రస్తుతం తాను దాని నుండి పూర్తిగా బయట పడ్డానని అమితాబ్ బచ్చన్ స్పష్టం చేసారు. అమితాబ్ నుండి ఈ ప్రకటన విని అభిమానులు తొలతు అభిమానులు షాకైనా...తర్వాత ఆయన పూర్తిగా కోలుకున్నారనే విషయం తెలిసి కోలుకున్నారు.
అయితే ఇన్నాళ్లు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచిన అమితాబ్.... ఇపుడు బయట పెట్టడానికి ఓ కారణం ఉంది. టిబి వ్యాధిపై అందరికీ అవగాహన కల్పించాలని అమితాబ్ నిర్ణయించుకున్నారు. నేను టిబి వ్యాధి నుండి సురక్షితంగా బయట పడ్డాను. త్వరలో భారత్ పూర్తిగా ఈ వ్యాధి నుండి బయట పడుతుంది అని ఆశావం వ్యక్తం చేసారు. ప్రపంచ ట్యూబర్కులోసిస్(టిబి) దినోత్సవం సందర్భంగా త్వరలో నిర్వహించే అవగాహన కార్యక్రమాల్లో అమితాబ్ పాలుపంచుకోబోతున్నారు.

నాకు 2000 సంవత్సరంలో టిబి సోకింది. దాదాపు సంవత్సరం పాటు చికిత్స తీసుకున్నాను. వెన్నముఖతో సంబంధం ఉన్న టిబి కావడంతో కూర్చున్నపుడు చాలా పెయిన్ అనిపించేది. ఆ సమయంలో కౌన్ బనేగా కరోడ్పతి కార్యక్రమంలో ఉన్నాను. గేమ్ షో సమయంలో రోజుకు దాదాపు 10 పెయిన్ కిల్లర్స్ వాడేవాడిని అన్నారు.
ఈ వ్యాధి నుండి సురక్షితంగా బయటపడ్డాను కాబట్టి...నేను అవకగాహన కల్పించడం ద్వారా ఆ వ్యాధితో బాధపడుతున్న వారికి మనోధైర్యాన్ని కల్పిస్తుంది. ఇపుడు నేను పూర్తిగా కోలుకున్నాను. త్వరలో భారత్ కూడా పూర్తిగా కోలుకుంటుంది.


Click it and Unblock the Notifications











