Don't Miss!
- Automobiles 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- News తెలంగాణలో నామినేషన్లను దాఖలు చేసిన బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరే
- Technology 1.5 మీటర్ల ఎత్తు నుంచి పడినా డ్యామేజీ కాని ఫోన్ ధర తగ్గింపు.. 108MP కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Sports IPL 2024: ఆ తెలుగు టీమ్ సాంగ్ ముందు ఏది పనికి రాదు: రోహిత్ శర్మ వీడియో
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
లక్ష్మీస్ ఎన్టీఆర్కు షాక్.. రిలీజ్ ఆపేయాలంటూ ఈసీకి ఫిర్యాదు!
దర్శకుడు రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హంగామా మొదలైపోయింది. అయినా కూడా ఈ చిత్రం కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మి పార్వతి ప్రవేశించిన తర్వాత జరిగిన ఎపిసోడ్ ని వర్మ ఈ చిత్రంలో చూపించబోతున్నాడు. ఎన్ని బెదిరింపులు ఎదురైనా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని విడుదల చేసి తీరుతానని వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే.
మొదటి నుంచి ఈ చిత్రాన్ని తెలుగుదేశం పార్టీ విమర్శిస్తోంది. ఈ ఎన్టీఆర్ చరిత్రని వక్రీకరించి విధంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారనేది టిడిపి నాయకుల వాదన. ఈ చిత్రాన్ని అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా కొందరు టీడీపీ నాయకులు ఎన్నికలపై ప్రభావం చూపేలా ఉన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని అడ్డుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందించారు.
ఈ చిత్రంలో చిత్రంలో చంద్రబాబు పాత్రని నెగిటివ్ గా చూపించారని టిడిపి ఆరోపిస్తోంది. ఎన్టీఆర్ చివరి రోజుల్లో జరిగిన వైస్రాయ్ సంఘటన, ఎన్టీఆర్ కుటుంబంలో తలెత్తిన విభేదాలు లాంటి వివాదాస్పద అంశాలని వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో చూపించబోతున్నారు. కనీసం ఈ చిత్రాన్ని ఏపీలో ఎన్నికలు ముగిసే వరకు అయినా అడ్డుకోవాలని టిడిపి నేతలు కోరుతున్నారు. ఈ పరిణామాల మధ్య లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం మార్చి 22న విడుదలవుతుందో లేదో చూడాలి.