twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు షాక్.. రిలీజ్ ఆపేయాలంటూ ఈసీకి ఫిర్యాదు!

    |

    దర్శకుడు రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హంగామా మొదలైపోయింది. అయినా కూడా ఈ చిత్రం కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మి పార్వతి ప్రవేశించిన తర్వాత జరిగిన ఎపిసోడ్ ని వర్మ ఈ చిత్రంలో చూపించబోతున్నాడు. ఎన్ని బెదిరింపులు ఎదురైనా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని విడుదల చేసి తీరుతానని వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే.

    మొదటి నుంచి ఈ చిత్రాన్ని తెలుగుదేశం పార్టీ విమర్శిస్తోంది. ఈ ఎన్టీఆర్ చరిత్రని వక్రీకరించి విధంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారనేది టిడిపి నాయకుల వాదన. ఈ చిత్రాన్ని అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా కొందరు టీడీపీ నాయకులు ఎన్నికలపై ప్రభావం చూపేలా ఉన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని అడ్డుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందించారు.

    TDP Leaders gives complaint to Election commission on Lakshmis NTR movie

    ఈ చిత్రంలో చిత్రంలో చంద్రబాబు పాత్రని నెగిటివ్ గా చూపించారని టిడిపి ఆరోపిస్తోంది. ఎన్టీఆర్ చివరి రోజుల్లో జరిగిన వైస్రాయ్ సంఘటన, ఎన్టీఆర్ కుటుంబంలో తలెత్తిన విభేదాలు లాంటి వివాదాస్పద అంశాలని వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో చూపించబోతున్నారు. కనీసం ఈ చిత్రాన్ని ఏపీలో ఎన్నికలు ముగిసే వరకు అయినా అడ్డుకోవాలని టిడిపి నేతలు కోరుతున్నారు. ఈ పరిణామాల మధ్య లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం మార్చి 22న విడుదలవుతుందో లేదో చూడాలి.

    English summary
    TDP Leaders gives complaint to Election commission on Lakshmi's NTR movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X