Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
'కేక' కోసం జైలు కెళతా: తేజ
ఎంతో కష్టపడి తమ బుర్రల్లోంచి పుట్టిన ఆలోచనలను సోమరుపోతుల్లా దొంగలించేవారిని చూస్తూ ఊరుకోబోమని పైరసీ దారులను హెచ్చరించారు. "జయం" సినిమా టైమ్లో తాము రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి తమ సినిమాను పైరసీ చేసిన వారిని కొందరిని పట్టుకున్నామని ఈ సందర్భంగా తేజ గుర్తు చేశారు. ఆ సమయంలో ఫిలిమ్ ఛాంబర్లో పైరసీ సెల్ ఉందనే విషయం తనకు తెలియదని ఆయన వ్యంగ్యంగా అన్నారు.
మరో నిర్మాత దిల్రాజు మాట్లాడుతూ... ఒక సినిమాను నిర్మించడానికి ఏడాది నుంచి ఏడాదిన్నర సమయం పడుతుందన్నారు. అంత కష్టపడి సినిమా తీస్తే విడుదలైన వెంటనే పైరసీ చేసేస్తున్నారని తెలిపారు. దీనివల్ల మంచి సినిమా నాశమనమతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలే విడుదలైన సినిమా పైరసీ సీడీలు వారంలోనే మార్కెట్లోకి వచ్చేస్తున్నాయని, వాటిని అడ్డుకునే చట్టమేమీ లేకపోవడం విచారకరమని పేర్కొన్నారు.
శౌర్యం నిర్మాత ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ.. నిర్మాతల నుంచి లక్షలు వసూలు చేస్తున్న యాంటీ వీడియో పైరసీ సెల్ ద్వారా ఎవరికైనా న్యాయం జరిగిందేమోకానీ తనకు మాత్రం అన్యాయం జరిగిందని చెప్పారు. తమ సినిమా డివీడీలు ఎక్కడబడితే అక్కడ విచ్చల విడిగా అమ్ముతున్నారని ఆనంద్ ఆందోళన వ్యక్తం చేశారు.
రచయిత
కోన
వెంకట్
మాట్లాడుతూ...
ఒక
సినిమాపై
ఎందరో
జీవితాలు
ఆధారపడి
ఉన్నాయని,
తమ
కష్టాన్ని
దొంగలు
దోచుకుంటే
రోడ్డునపడే
పరిస్థితి
వస్తుందన్నారు.
ఇంకా
ఈ
విలేకరుల
సమావేశంలో
చింతకాయల
రవి
నిర్మాత
నల్లమలుపు
బుజ్జికూడా
మాట్లాడారు.