Don't Miss!
- News మోదీ వలనే బంగారు రేటు పెరిగింది, ఐటీ అధికారులకు కళ్లు ఉన్నాయా, టీడీపీతో పొత్తు పెట్టుకుని ?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports అతని వల్లే RCB టైటిల్ చేజారింది- అనిల్ కుంబ్లే
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'ఎన్టీఆర్' నుంచి బయటకు వచ్చాక తేజ నిర్ణయం.. ఇండియా, పాక్ వార్, హీరో అతడే!
Recommended Video
కెరీర్ ఆరంభంలో జయం, నువ్వు నేను వంటి ప్రేమ కథాచిత్రాలతో ప్రతిభగల దర్శకుడిగా తేజ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత కొన్ని సంవత్సరాల పాటు తేజకు సరైన విజయం దక్కలేదు. గత ఏడాది రానా దగ్గుబాటి హీరోగా నేనే రాజు నేనే మంత్రి చిత్రాన్ని తెరకెక్కించాడు. రాజకీయ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. దీనితో దర్శకుడిగా తేజ ప్రతిభ మళ్ళీ వెలుగులోకి వచ్చింది. తేజకు ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కించే అరుదైన అవకాశం వచ్చిందంటే అది నేనే రాజు నేనే మంత్రి చిత్రం వలనే అని చెప్పొచ్చు. కానీ బాలయ్యతో తలెత్తిన విభేదాల కారణంగా తేజ ఎన్టీఆర్ బయోపిక్ నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం తేజ మరో ప్రయోగాత్మక చిత్రానికి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
'ఎన్టీఆర్' బయోపిక్ నుంచి బయటకు
ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని తెరకెక్కించడం అంటే కత్తిమీద సాము లాంటి వ్యవహారమే. ఎన్టీఆర్ జీవిత చరిత్రతో అనేక రాజకీయ అంశాలు ముడిపడి ఉన్నాయి. అలంటి చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం తేజకు దక్కడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. అంతలోనే తేజ ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
బాలయ్యతో తేడా కొట్టింది
ఎన్టీఆర్ జీవిత చరిత్రని ఎలా చెప్పాలి అనే విషయంలో బాలయ్యతో తేజ విభేదించారట. ఈ చిత్రం నుంచి తేజ తప్పుకోవడానికి ప్రధాన కారణం ఇదే అని వార్తలు వస్తున్నాయి.
ప్రయోగం దిశగా అడుగులు
నేనే రాజు నేనే మంత్రి వంటి రాజకీయ నేపథ్యం ఉన్న చిత్రాన్ని విజయవంతం చేసిన తేజ మరో మారు ఆసక్తికర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 1971 ఇండియా, పాక్ వార్ నేపథ్యంలో చిత్రానికి ప్లాన్ చేస్తున్నాడట.
హీరో అతడే
తాను దర్శకుడిగా తిరిగి విజయాల బాట పట్టడానికి కారణం అయిన రానా తోనే ఈ చిత్రాన్ని చేయాలని తేజ భావిస్తున్నాడు. ఇప్పటికి ఐడియాని రానాకు వివరించినట్లు తెలుస్తోంది. తేజ ఐడియా రానాకు కూడా నచ్చినట్లు తెలుస్తోంది. తన పాత్ర మంచి పట్టుతో కూడుకున్నది కావడంతో ఓకె చెప్పినట్లు సమాచారం.
పైలెట్గా
ఇండియా, వార్ నేపథ్యంలో రూపొందబోతున్న ఈ చిత్రంలో రానా యుద్ధ విమానాలకు పైలెట్ పాత్రలో కనిపిస్తాడట. రాజా ఇప్పటికే ఘాజి చిత్రంలో నేవి అధికారిగా నటించిన సంగతి తెలిసిందే. తేజ, రానా కాంబినేషన్ లో రాబోతున్న రెండవ చిత్రం మరింతగా అంచనాలు పెంచుతుంది అనడంలో సందేహం లేదు.