Don't Miss!
- News చిలుకూరు బాలాజీ ఆలయానికి గరుడ ప్రసాదం కోసం భక్తుల రష్.. అసలేమిటీ గరుడ ప్రసాదం?
- Sports ఐపీఎల్లో అదరగొడుతున్న అన్ క్యాప్డ్ ప్లేయర్లు వీళ్లే..
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
వేడెక్కిన తెలంగాణ: వర్మ సినిమాకు భారీ నష్టం
హైదరాబాద్: ఖమ్మం జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతూ పార్లమెంటులో బలవంతంగా ఆర్టినెన్స్ ఆమోదించారంటూ తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు, జేఏసీ శనివారం రాష్ట్ర బందుకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్లు ఈ బంద్ ఎఫెక్ట్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'ఐస్ క్రీం' సినిమాపై పడింది.
వాస్తవానికి 'ఐస్ క్రీమ్' నిన్న(జులై 11)న విడుదల చేయాల్సి ఉండగా.....'దృశ్యం' సినిమా కారణంగా విడుదల 12కు వాయిదా వేసారు. తెలుగు సినిమా ప్రధాన ఆదాయం వచ్చేది నైజాం ఏరియా నుండే. అయితే సడన్గా బంద్ పిలుపు రావడం సినిమాను తెలంగాణ ప్రాంతంలో చాలా చోట్ల నిలిపి వేసారు. తొలి రోజు కావడంతో భారీ నష్టాలు వచ్చాయి.
మరో వైపు సినిమా ఇతర ప్రాంతాల్లో విడుదలైంది. సినిమాకు ఎక్కడ చూసినా నెగెటివ్ టాకే. దీంతో రేపటి నుండి ఈ సినిమాకు వసూళ్లు ఆశించిన స్థాయిలో రావడం కష్టమే అంటున్నారు. బంద్ లేకుండా ఉంటే తెలంగాణ ప్రాంతంలో సినిమాకు ఓపెనింగ్స్ బాగుండేవని, కానీ పరిస్థితి పూర్తిగా తలక్రిందులైందని నిర్మాతలు లబోదిబో మంటున్నారు.
'ఐస్ క్రీమ్' చిత్రంలో తేజస్వి, నవదీప్ ప్రధాన పాత్రల్లో నటించారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని బీమవరం టాకీస్ బేనర్లో తుమ్మలపల్లి సత్యనారాయణ నిర్మించారు. సాయి కార్తీక్ సంగీతం అందించారు.