twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సీఎం బెదిరిస్తున్నారు: తెలంగాణ దర్శకులు

    By Srikanya
    |

    రాష్ట్ర విభజన కీలక దశకు చేరిన సమయంలో సినీ పరిశ్రమ చెన్నైకి వెళ్తోందని ముఖ్యమంత్రి కె.రోశయ్య ప్రమాదకర వ్యాఖ్యలు చేశారని సంఘం అధ్యక్షులు దర్శకుడు డా.ఎల్‌.శ్రీనాధ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ సినీ దర్శకుల సంఘం ఏర్పడిన సందర్భంగా ఆయన సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం ఏర్పాటుచేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఇప్పటికే సంక్షోభంలో ఉన్న చిత్ర పరిశ్రమకు సీఎం మాటలు బెదిరింపుల్లా ఉన్నాయి..తన మాటలతో ఆయన విషబీజం వేస్తున్నారు..అయినా ఏ ఆధారాలతో సీఎం అలా మాట్లాడారో వివరించాలంటూ ఆయన డిమాండు చేసారు. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమకు తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ తేడాలు లేవన్నారు. తెలంగాణ ప్రాంత సంస్కృతిని గౌరవిస్తూ దాన్ని చిత్రాల రూపంలో వివరించేందుకే సంఘం ఏర్పడిందన్నారు. చిత్ర పరిశ్రమకు భౌగోళిక ముద్ర వేయొద్దని విజ్ఞప్తిచేశారు.

    హైదరాబాద్‌ నగరంతో దాదాపు ఏడు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉన్న తెలుగు సినీ పరిశ్రమ ఇక్కడి నుంచి చెన్నైకి వెళ్తుందనేది పొరపాటని తెలంగాణ సినీ దర్శకుల సంఘం పేర్కొంది. అంతేగాక నగరంలో అత్యంత వైభవంగా నిర్మించిన రామోజీ ఫిలింసిటీ, ప్రసాద్‌ లేబరేటరీస్‌, రామానాయుడు, అన్నపూర్ణ స్టూడియోలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడి నుంచి పోవని పేర్కొన్నారు. షూటింగ్‌లపై, సినిమా థియేటర్లపై దాడులు సరికాదన్నారు. వంద సినిమాల్లో ఒకటి రెండింటినే అడ్డుకున్న విషయం అర్థం చేసుకోవాలన్నారు. సినీ ప్రముఖులు కూడా భావోద్వేగాలకు లోను కావొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు సి.వి.ఎల్‌.నర్సింహారావు, సుధీర్‌ పాల్గొని మాట్లాడారు. ఇక దర్శకుడు డా.ఎల్‌.శ్రీనాధ్ గతంలో కుబుసం(శ్రీహరి),అమ్ములు(వందేమాతరం శ్రీనివాస్) చిత్రాలు రూపొందించారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X