Don't Miss!
- News మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం జగన్
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
- Finance Gold Rate: రంకెలు వేస్తున్న బంగారం ధరలు.. నేడు రూ.3,800 పెరగటంతో..
- Automobiles బుల్లితెర నటి 'ప్రజ్ఞా భట్' కొత్త కారు చూసారా.. ధర ఎంతో తెలుసా?
- Sports Hardik Pandya: కెప్టెన్గా చెత్త రికార్డు సాధించా.. హ్యాపీనే!
- Lifestyle ఈ అలవాట్లు ఉన్నవారికి తీవ్ర కడుపులో అల్సర్ వచ్చే అవకాశం ఉంది...వెంటనే బయటపడండి...!
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
తెలంగాణా సినిమా 'ధూం ధాం' రిలీజ్ డేట్..
ప్రజాకవి గోరటి వెంకన్న ప్రత్యేక పాత్రధారిగా డైలీ 4 షోస్ పతాకంపై వై. వైవస్వత మను నిర్మించిన 'ధూం ధాం' చిత్రం నిర్మాణ కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేసుకుని ఈనెల 22న విడుదలకు సిద్ధమయ్యింది. ఈ సంగతిని నిర్మాత వైవస్వత మను తెలియజేస్తూ "తెలంగాణ ప్రజల మనోభావాలకు ప్రతిరూపం ఈ చిత్రం. తెలంగాణ ప్రజల బ్రతుకులనూ, వారి అవస్థలనూ ఈ చిత్రంలో చూపించాం. గాయని బేబి మధుప్రియ, ప్రముఖ రచయిత, గాయకుడు గోరటి వెంకన్న ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇటీవలే ఉస్మానియా యూనివర్సిటీలో విడుదలైన ఆడియో సంచలనం సృష్టిస్తోంది.నేను కూడా ప్రధానమైన ఒక జర్నలిస్టు పాత్రను చేశా. తెలంగాణ సాధన కోసం పోరాడి, మృతి చెందిన విద్యార్థులకి ఈ సినిమాని అంకితమిస్తున్నాం. ప్రేక్షకులు తప్పకుండా ఈ చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాం" అని చెప్పారు. బ్రహ్మాజీ, రఘునాథరెడ్డి, పద్మాజయంతి, రాంబాబు, వైజాగ్ లక్ష్మి తారాగణమైన ఈ చిత్రానికి రచన, సంగీతం, దర్శకత్వం: శివానంద్ యాలాల.