Don't Miss!
- News నరసాపురం నాదే-రెండ్రోజుల్లో ఎన్డీయే అభ్యర్ధిగా ప్రకటన-రఘురామ కామెంట్స్..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
'తెలంగాణ సినిమా' త్వరలో విడుదల
తెలంగాణ సినిమాలు సొంతంగా తయారు చేసుకుంటామని తెలంగాణ వాదులు ప్రకటించి ఎంతో కాలం కాలేదు. అప్పుడే 'ధూం ధాం' అనే టైటిల్ తో ఓ చిత్రం రూపొందించి రిలీజుకు రెడీ చేస్తున్నారు. ఈ చిత్రంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజాకవి గోరటి వెంకన్న ప్రధాన పాత్రధారి. ఆయన రాసిన పల్లె తెల్లారి పోతుందో..పాట అప్పట్లో సంచలనం. కాంగ్రేస్ పార్టీ ప్రచారానికి ఆ పాటని వాడుకుంటే..కుబంసం చిత్రంలో ఆ పాటని విజువలైజ్ చేసి పేరు తెచ్చుకున్నారు. ఇక ఈ చిత్రం డైలీ 4 షోస్ పతాకంపై వై. వైవస్వత మను నిర్మించారు. ఈ 'ధూం ధాం' చిత్రం గురించి నిర్మాత వైవస్వత మను మాట్లాడుతూ "తెలంగాణ ప్రజల సమస్యల నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది. గోరటి వెంకన్న పాటలు చిత్రానికి అదనపు ఆకర్షణ. బాల గాయని మధుప్రియ ఒక కీలక పాత్రను చేసింది. నేను కూడా ప్రధానమైన ఒక జర్నలిస్టు పాత్రను చేశా. తెలంగాణ సాధన కోసం పోరాడి, మృతి చెందిన విద్యార్థులకి ఈ సినిమాని అంకితమిస్తున్నాం'' అని చెప్పారు. బ్రహ్మాజీ, రఘునాథరెడ్డి, పద్మాజయంతి, రాంబాబు, వైజాగ్ లక్ష్మి తారాగణమైన ఈ చిత్రానికి రచన, సంగీతం, దర్శకత్వం: శివానంద్ యాలాల. ఈ చిత్రంతో పాటు బాంచన్ నీ కాల్మెక్తా..ఇంకెన్నాళ్ళు అనే చిత్రం కూడా ప్రారంభం అయిన ున్న సంగతి తెలిసిందే. ఈ తెలంగాణ సినిమా హిట్టే మరిన్ని తెలంగాణ సినిమాలు నిర్మాణమవ్వాలని కోరుకుందాం.