Don't Miss!
- Sports ధోనీ సార్ ధోనీ.. అంతే: సౌండ్ లెవెల్ ఏ రేంజ్లో ఉందంటే..
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
తెలుగు సినిమాలు చూడొద్దన్న తెలంగాణ కవి మొహాన ఉమ్మేస్తున్నారు
నాగార్జున, బన్నీ, జూ ఎన్టీఆర్ సినిమాల్ని చూడొద్దనీ, అమితాబ్, షారుక్ సినిమాల్ని చూద్దామని తెలంగాణ విద్యావంతుల వేదిక తెలంగాణ ప్రజలకు పిలుపునిస్తోంది. తెలుగు సినిమాల్ని చూడం మానేసి, తెలంగాణ ప్రజలంతా హిందీ సినిమాల్ని చూడాలని తెలంగాణ కవి దేశపతి శ్రీనివాస్ అల్టిమేటం జారీ చేశారు. వినడానికి విచిత్రంగా వున్నా, తెలుగు సినీ పరిశ్రమలో పెద్దలంగా తెలంగాణ వ్యతిరేకులేననీ, అందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామనీ, తెలంగాణ ప్రజల్ని తెలుగు సినిమాలు చూడొద్దని పిలుపునిచ్చామనీ దేశపతి శ్రీనివాస్ అంటున్నారు.
అయితే తెలంగాణ వాడికి తెలుగే సరిగా అర్థం కాదు, హిందీనా ఇకఇకలు పకపకలు. తెలుగోడు చేదయ్యాడుగానీ, షారుక్, అమితాబ్ ముద్దయ్యారా ? అంటూ విన్నవారంతా దేశపతి మొహాన ఉమ్మేస్తున్నారు. ఏవో నాలుగు పిచ్చి రాతలు రాసి కవి అయినంత మాత్రాన ఇతరులను శాసించే హక్కు ఎవరిచ్చారని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. మీకిష్టముంటే చూడండి, లేకపోతే వదిలేయండి ఇతరులను సినిమా చూడద్దని చెప్పటానికి మీరెవరని సినీ విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలకు తెలంగాణ మహా కవియైన దేశపతి ఏం సమాదానం చెబుతారో?