Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
‘తెలంగాణ విజయం’ సినిమా డీటేల్స్
హైదరాబాద్: షిరిడి సాయి క్రియేషన్స్ బ్యానర్ పై మాస్టర్ సాయి చరణ్, సాయి త్రిశాంక్ నిర్మాణ సార్థ్యంలో తెరకెక్కుతున్న చిత్రం 'తెలంగాణ విజయం'. బిపిన్ దర్శక నిర్మాత. శ్రీహర్ష, క్రాంతి, సాయి త్రిశాంక్ లతో పాటు బాబు మోహన్, ప్రొఫెసర్ కోదండరామ్, ప్రముఖ న్యాయవాది టి.రంగారావు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
పిన్నింటి జానకిరామారావు, ప్రీతి నిగమ్లపై కీలకమైన పాటను సారథి స్టూడియోలో చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత బిపిన్ మాట్లాడుతూ...60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరింది. ఇది తెలంగాణ ప్రజల విజయం. వెయ్యి మంది విద్యార్థుల ఆత్మబలిదానాల త్యాగమే ఈ తెలంగాణ అని తెలిపారు.
సినిమాలోని అంశాలు
ఇది పది జిల్లాలతో కూడిన తెలంగాణ, హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని, దేశంలో 29వ రాష్ట్రం, తెలంగాణ అమరవీరుల తల్లిదండ్రులకు నెలకు పదివేలు పించను, 5 ఎకరాల భూమి, వారి కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి అన్న ప్రధానాంశాలతో ఈ చిత్రం తెరరెక్కింది.
పాట చిత్రీకరణ
ప్రస్తుతం ‘చుక్కలాంటి చుక్కలో...లక్షలాంటి చుక్కల్లో' అనే పాటను ప్రీతినిగమ్, పిన్నింటి జానకి రామారావులపై చిత్రీకరిస్తున్నామని తెలిపారు.
విడుదల తేదీ
మరో వైపు నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. త్వరలో పాటలు విడుదల చేసి, జులై రెండో వారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని తెలిపారు.
నటీనటులు, సాంకేతిక విభాగం
సాయి చరణ్, సాయి త్రిశాంక్, బాబు మోహన్, గౌతం రాజు, నర్శింహరాజు, బిపిన్, వహీద, కల్పన, రోజా, వినోద్, అశోక్ కుమార్, గుండు హనుమంతరావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: శ్రీమతి రమ్య, సహ నిర్మాత: బిల్లా ప్రభాకరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పిన్నింటి జానకిరామారావు, ఎడిటర్: వి.నాగిరెడ్డి, డిఓపి: మదు.ఏ నాయుడు, కథ-మాటలు-పాటలు-సంగీతం-దర్శకత్వం: బిపిన్.