Don't Miss!
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- News గంటాకు సీటు ఖరారు - టీడీపీ తుది జాబితా విడుదల, లిస్టులో..!!
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
హాట్ టాపిక్:ఆ తెలుగు దర్శకుడి దారుణ హత్య
గతంలో నేను ముఖ్యమంత్రి అయితే అనే టైటిల్ తో ఓ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో నటించి,డైరక్ట్ చేసిన మందలపు వెంకట నరేంద్ర(42)అనే అతను గుంటూరులోలో దారణ హత్యకు గురి అవటం..ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అతను సిఎం రాజన్న అనే టైటిల్ తో ఓ చిత్రం కూడా ప్లాన్ చేసాడు. అయితే ఆ సినిమా మెటిరియలైజ్ కాలేదు. అమ్మాయిలను పెళ్లి చేసుకుని మోసం చేయటం,సినిమాలు ప్లాన్ చేయటం వృత్తిగా పెట్టుకున్న ఇతనకి ఇండస్ట్రీలో చాలా మందితో పరిచయాలే ఉన్నాయని తెలుస్తోంది. అయితే నరేంద్ర ఇలాంటి వాడని ఎవరూ ఊహిచంలేదని వారంతా మాట్లాడుకుంటున్నారు. అలాగే నరేంద్ర తీసిన సినిమా కూడా ఆడలేదు. అయినా తాను కంటిన్యూగా సినిమాలు తీస్తానని చెప్పేవాడని,ఆ పిచ్చే ఇలా మోసాలు చేసే స్ధితికి దిగజార్చిందా అని అంతా మాట్లాడుకుంటున్నారు.
ఇక నరేంద్ర నెల్లూరు జిల్లా నాయుడుపేటకు చెందినవాడు. అతని మేనమామ అని చెప్పే ఓ వ్యక్తి తప్ప మిగతా కుటుంబ సభ్యులెవరో కూడా తెలియదు. ఓ కేసులో అమెరికాలో నరేంద్రకు 20 నెలల జైలు శిక్ష పడింది. పైకోర్టుకు వెళ్లడంతో దాన్ని పది నెలలకు కుదించింది. ఆ తర్వాత ఇండియాకు పంపించేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత పెళ్లిళ్లు చేసుకుని మోసాలు చేయడం ప్రారంభించాడు. నరేంద్ర ఇప్పటి వరకు పంజాబ్కు చెందిన ఓ యువతిని, తెనాలికి చెందిన డాక్టర్ను, హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ను, గుంటూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ను పెళ్లి చేసుకున్నాడు. గుంటూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాదులో ఉంటోంది. అమెరికాలో పంజాబ్కు చెందిన యువతిని నరేంద్ర పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నరేంద్ర తీరు నచ్చక ఆమె విడాకులు ఇచ్చేసి పంజాబ్కు చేరుకుంది. ఆ గొడవల్లోనే అతన్ని చంపేసారు.