twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సీఎం జగన్‌‌కు జై.... విష్ చేసిన తెలుగు సినీ స్టార్స్!

    |

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంచలన విజయం సాధించింది. 175 స్థానాలకుగాను 150కిపైగా స్థానాల్లో విజయదుందుభి మ్రోగించింది. 25 లోక్ సభ నియోజకవర్గాలకుగాను 24 చేజిక్కించుకుని సంచలనం క్రియేట్ చేసింది. ఈ నెల 30న జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో పలువురు సినీ స్టార్లు ట్విట్టర్ ద్వారా స్పందించారు. కాబోయే ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్స్ చేశారు. ఆయన చక్కటి పాలన అందిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. జగన్‌ను విష్ చేసిన వారిలో రవితేజ, రామ్ పోతినేని, మంచు విష్ణు, మనోజ్, మోహన్ బాబు తదితరులు ఉన్నాయి.

    రవితేజ

    ‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న యువతనేతకు కంగ్రాట్స్. మీ నుంచి మంచి పాలన కోసం ఎదురు చూస్తున్నాం. అంతా మంచి జరుగాలని కోరుుంటున్నాం.'' అని మాస్ మహారాజ రవితేజ ట్వీట్ చేశారు.

    శ్రీను వైట్ల

    వైఎస్ జగన్ గారికి శుభాకాంక్షలు. ఇది చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే విజయం. మీరు అద్భుతమైన పాలన అందించాలని కోరుకుంటున్నట్లు శ్రీను వైట్ల ట్వీట్ చేశారు.

    రామ్ పోతినేని

    ‘‘నరేంద్రమోడీతో పాటు వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు... మీ పాలనలో ఈ దేశం, రాష్ట్రం అద్భుతమైన అభివృద్ధి చెందుతుందని ఎదురు చూస్తున్నాం.'' అంటూ రామ్ పోతినేని ట్వీట్ చేశారు.

    గుత్తా జ్వాల

    ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల వైఎస్ జగన్‌ను విష్ చేస్తూ ట్వీట్ చేశారు.

    రాజ్ కందుకూరి

    "విజయం అంటే ఇలా ఉండాలి. ఇంత బలంగా ఉండాలి. ఇది ప్రజా తీర్పు. ప్రధాని మొడి గారికి, బిజేపి శ్రేణులకు, వైయస్ జగన్ గారికి మరియు వైయస్ఆర్ సీపి శ్రేణులకు హార్ధిక శుభాభినందనలు. చక్కటి పరిపాలన మరియు ప్రజాక్షేమం సదా అందిస్తారని బలంగా విశ్వసిస్తున్నా.'' అంటూ రాజ్ కందుకూరి ట్వీట్ చేశారు.

    మోహన్ బాబు

    "ప్రజల తీర్పు ఎప్పుడూ గొప్పదే.. శ్రీ రాజశేఖర్ రెడ్డి గారు తన బిడ్డ జగన్ కి ధైర్య సాహసాలతో పాటు ఆశీస్సులు ఇచ్చాడు. జగన్ 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నాడు. ప్రజలు ఆశీస్సులు అందచేసి ముఖ్యమంత్రిని చేసారు. కచ్చితంగా ప్రజలకు మంచి చేసే ముఖ్యమంత్రి మన జగన్." అంటూ మోహన్ బాబు ట్వీట్ చేశారు.

    మంచు విష్ణు

    ‘ఇది ఏపీ ప్రజల విజయం. జగన్ అన్నకు కంగ్రాట్స్. ఇక వచ్చేది ప్రజల ప్రభుత్వమే. ప్రజల కోసం ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వం వైఎస్ జగన్ ప్రభుత్వం.' అని మంచు విష్ణు ట్వీట్ చేశారు.

    మంచు మనోజ్

    జగన్ అన్నకు కంగ్రాట్స్. ఇది పవర్‌ఫుల్ విక్టరీ... వైసీపీ ప్రభుత్వం రైతులు, విద్యార్థులకు మంచి చేస్తుందని ఆశిస్తున్నాను. ప్రజలకు అద్భుతమైన, నిజాయితీతో కూడిన పాలన అందుతుందని నమ్మకం ఉందని మంచు మనోజ్ ట్వీట్ చేశారు.

    English summary
    "Congratulations to #CM ysjagan anna on the powerful win. I hope YSRCParty government will take care of the farmers and the students of #AP...Looking forward for your contribution in developing and building our state even more with justice and honesty." Manchu Manoj tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X