Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
హీరో ఆది... పెళ్లి విషయం లీక్ అయింది!
హైదరాబాద్: ‘ప్రేమ కావాలి', ‘లవ్లీ', ‘సుకుమారుడు', ‘గాలిపటం' చిత్రాల్లో నటించిన తెలుగు హీరో ఆది త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. ఆది తండ్రి, నటుడు సాయి కుమార్ ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇటీవలే ఆది ఓ అమ్మాయిని ఇష్ట పడ్డాడని, కొన్ని నెలల్లో(2015లో..) ఆది వివాహం జరుగబోతోందని ఫిల్మ్ నగర్ టాక్. అయితే ఆది కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని సీక్రెట్గా ఉంచాలని ప్రయత్నించినప్పటికీ బయటకు లీకైనట్లు సమాచారం.
ప్రస్తుతం ఆది ‘గరం' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా వివరాల్లోకి వెళితే..., 'పెళ్లైన కొత్తలో', 'గుండె ఝల్లుమంది', 'ప్రవరాఖ్యుడు' చిత్రాల ఫేం మదన్ దర్శకత్వంలో ఆర్.కె.స్టూడియోస్ పతాకంపై ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుమార్ ఎం. నిర్మిస్తున్న చిత్రం 'గరం'. ఇటీవలే రామానాయుడు స్టూడియోలో ప్రారంభోత్సవం. ఆది సరసన ఆదాశర్మ కథానాయికగా నటిస్తోంది.
సినిమా గురించి ఆది తెలియజేస్తూ ''టైటిల్ చాలా హాట్గా ఉంది. స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది. సంభాషణలు కూడా చాలా బాగుంటాయి. శ్రీనివాస్ మంచి కథ ఇచ్చారు. ఈ చిత్రం ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది'' అన్నారు. మదన్ మాట్లాడుతూ ...'నా అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ ఈ కథ అందించారు. చాలా బాగుంది. నిర్మాతకు ఇది తొలి సినిమా అయినప్పటికీ ఫిలిం మేకింగ్ మీద చాలా క్లారిటీ ఉంది. సమస్యలను అలవోక గా అధిగమించి ముందుకు సాగే ఓ కుర్రాడి కథ ఇది. ప్రేమతో దేన్నయినా సాధించొచ్చన్నది ప్రధాన ఇతివృత్తం. వినోద ప్రధానంగా సాగే చిత్రం ఇది'' అని తెలిపారు.
సెప్టెంబర్ 15నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. అక్టోబర్లో ఓ వారం గ్యాప్ తీసుకుని రెండో షెడ్యూల్ ఆరంభించనున్నారు. మూడు పాటలను ఫారిన్ లో చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈచిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి డిసెంబర్ రెండు లేదా మూడో వారంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు - శ్రీనివాస్ గవిరెడ్డి, కెమెరా - సురేందర్ రెడ్డి.టి, సంగీతం - ఆగస్త్య, కళ - నాగేంద్ర, ఎడిటింగ్ - కార్తీక్ శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత - బి.నాగిరెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: హరికృష్ణ జి., కో-డైరెక్టర్ - అనిల్, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - మదన్.